మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

12, డిసెంబర్ 2010, ఆదివారం

"మాట్లాడే వెన్నెముక.....విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)"


మాట్లాడే వెన్నెముక.....విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)" మాట్లాడే వెన్నెముక-పాట పాడే సుషుమ్న;నిన్నటి నన్నయభట్టు-నేటి కవి సామ్రాట్టు;గోదావరి పలుకరింత-కృష్ణానది పులకరింత;కొండవీటి పొగమబ్బు-తెలుగువాళ్ళ గోల్డునిబ్బు "అని శ్రీశ్రీ ...విశ్వనాథగురించి అన్నారు ----తూర్పింటి నరేశ్ కుమార్

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ....తన శిష్యుని గురించి ఇలా అన్నాడు.....
"నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్
సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్వ్త మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్ ".
శ్రీశ్రీ విశ్వనాథగురించి ఇలా అన్నాడు......
"మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద ".
తెలుగు సాహిత్యంలో ప్రాచీన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం వీరి రచనలు.
సాహిత్యంలో గౌరీశంకర శిఖరం తో వీరిని పోలుస్తారు.
అటువంటి వీరి జీవిత విశేషాలను తెలుసుకోవడం సాహితీ విద్యార్థి గా మనవిధి.
వారి జీవితాంశాలను ఓ సారి పరికిద్దాం....
విశ్వనాథ సత్యనారాయణ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి))
కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు.
తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. 
విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లిమరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులుబందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూల్ లోచెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం.
బి.ఎ. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బందరు హైస్కూల్ లోనే ఉపాధ్యాయునిగా చేరాడు.
ఉద్యోగం చేస్తూనే మద్రాసువిశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు.
తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు..
విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు.
ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు,
విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి.
ఆయన మాటలలోనే చెప్పాలంటే.......
"నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను
చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ...అని అన్నాడు .ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును.
విశ్వనాథ గురించి జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు -
"ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి.
వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు.
గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో
ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది.వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో,
భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది.
మహాకవి గా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం.
విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాధ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి
పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, స్వయం ప్రకాశవంతమయిన
పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!
ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచయితలను కొన్నైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే
ఆయన అంతర్జాతీయ ఖ్యాతినర్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు.
***అయితే విశ్వనాధ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యపడదు అన్నది జగమెరిగిన సత్యం .
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు.
ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నాడు.
* జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు, జ్ఞానపీఠపురస్కారాన్ని అందించినపుడు, సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది.********

********"As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare "range" Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene".**************************

*తమిళనాడులోని మధురై ప్రాంతం నేపధ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు
మళయాళంలోనికి,అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది.
ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు.
*వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించాడు.
*భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి.
*కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు.
*విశ్వనాధ నవలలలో పురాణవైర గ్రంధమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ
భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతో నిండిన కధ,
అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.
విశ్వనాధ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగింది.
తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవాడు. ఇందువల్ల విశ్వనాధను వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు.
ఛాందసుడు అనీ, "గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్" అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించారు.
విశ్వనాధకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు. కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు.
షేక్స్‌పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించాడు.
గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాధకు తన ప్రతిభ గురించ అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు.
తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు
లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నాడు విశ్వనాధ.

"అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్ ".
జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాధ అనేవాడు.
శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవాడు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి
గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకొనేవాడు.
విశ్వనాధ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీనరసింహం ఇలా ప్రశంసించాడు: -
"ఆహారపుష్టి గల మనిషి. ఉప్పూ కారం, ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం. కాఫీలో గాని తాంబూలంలోగాని ఎక్కువగా పంచదార వాడేవారు.
ఆజానుబాహువు. బ్రహ్మతేజస్సు ముఖాన, సరస్వతీ సంపద వాక్కున, హృదయ స్థానాన లక్ష్మీకటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల.
మనస్సు నవ్య నవనీతం. వాక్కు దారుణాఖఁడల శస్త్రతుల్యం. చదివేవి ఎక్కువ ఆంగ్ల గ్రంధాలు. వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంధాలు.
చిన్నలలో చిన్న, పెద్దలలో పెద్దగా వదిగి పోయే స్వభావం. శారీరికంగా వ్యాయామం, యోగాభ్యాసం అయన నిత్యం అభ్యసించేవి.
విమర్శలూ, స్తోత్రాలూ, తిట్లూ, దీవెనలూ, దారిద్ర్యం, ఐశ్వర్యం - ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడు. ఒకమాటలో ఆయన
అపూర్వమైన 'దినుసు' అని ప్రశంసించాడు.
అవార్డులు - రివార్డులు :
*ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సామ్రాట్" బిరుదుతో సత్కరించింది.
* 1964లో ఆంధ్రా యూనివర్సిటీ "కళాప్రపూర్ణ" తో సన్మానించింది.
* 1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో "గజారోహణం" సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.
* శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
* "విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
* 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
* 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.
నవలా సాహిత్యం :
* వేయిపడగలు
* స్వర్గానికి నిచ్చెనలు
* చెలియలికట్ట
* ఏకవీర
* తెఱచిరాజు
* మాబాబు
* జేబుదొంగలు
* వీరవల్లడు
* వల్లభమంత్రి
* విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
* పులుల సత్యాగ్రహము
* దేవతల యుద్ధము
* పునర్జన్మ
* పరీక్ష
* నందిగ్రామరాజ్యం
* బాణావతి
* అంతరాత్మ
* గంగూలీ ప్రేమకధ
* ఆఱునదులు
* చందవోలు రాణి
* వేయి పడగలు
* శ్రీమద్రామాయణ కల్పవృక్షము
* కిన్నెరసాని పాటలు
* విశ్వనాధ మధ్యాక్కఱలు
* ప్రళయనాధుడు
* హాహాహూహూ
* మ్రోయు తుమ్మెద
* సముద్రపు దిబ్బ
* దమయంతీ స్వయంవరము
* నీల పెండ్లి
* శార్వరి నుండి శార్వరి దాక
* కుణాలుని శాపము
* ధర్మచక్రము
* కడిమిచెట్టు
* వీరపూజ
* స్నేహఫలము
* బద్దన్న సేనాని
* దిండు క్రింది పోకచెక్క
* చిట్లీచిట్లని గాజులు
* సౌదామిని
* లలితాపట్టణపు రాణి
* దంతపు దువ్వెన
* దూతమేఘము
* కవలలు
* యశోవతి

* పాతిపెట్టిన నాణెములు
* సంజీవకరణి
* మిహిరకులుడు
* భ్రమరవాసిని
* పురాణవైర గ్రంథమాల (పన్నెండు నవలలు)
o భగవంతునిమీది పగ
o నాస్తిక ధూమము
o ధూమమరేఖ
o నందో రాజా భవిష్యతి
o చంద్రగుప్తుని స్వప్నము
o అశ్వమేధము
o అమృతవల్లి
o పులిమ్రుగ్గు
o నాగసేనుడు
* హెలీనా
* వేదవతి
* నివేదిత
* నేపాళరాజ చరిత్ర (ఆరు నవలలు)
* కాశ్మీర రాజ చరిత్ర (ఆరు నవలలు

* శ్రీమద్రామాయణ కల్పవృక్షము
(6 కాండములు)
* ఆంధ్రప్రశస్తి
* ఆంధ్రపౌరుషము
* విశ్వనాథ మధ్యాక్కఱలు
* ఋతు సంహారము
* శ్రీకుమారాభ్యుదయము
* గిరికుమారుని ప్రేమగీతాలు
* గోపాలోదాహరణము
* గోపికాగీతలు
* భ్రమరగీతలు



* ఝాన్సీరాణి
* ప్రద్యుమ్నోదయము
* రురుచరిత్రము
* మాస్వామి
* వరలక్ష్మీ త్రిశతి
* దేవీ త్రిశతి (సంస్కృతం)
* విశ్వనాథ పంచశతి
* వేణీభంగము
* శశిదూతము
* శృంగారవీధి
* శ్రీకృష్ణ సంగీతము
* నా రాముడు
* శివార్పణము
* ధర్మపత్ని
* భ్రష్టయోగి (ఖండకావ్యము)
* కేదారగౌళ (ఖండకావ్యము)
* గోలోకవాసి
* దమయంతీస్వయంవరం
నాటకములు :
* అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)
* గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
* గుప్తపాశుపతము
* అంతా నాటకమే
* అనార్కలీ
* కావ్యవేద హరిశ్చంద్ర
* తల్లిలేని పిల్ల
* త్రిశూలము
* నర్తనశాల
* ప్రవాహం

* లోపల - బయట
* వేనరాజు
* అశోకవనము
* శివాజి - రోషనార
* ధన్యకైలాసము
* నాటికల సంపుటి (16 నాటికలు)

విమర్శలు :
* అల్లసానివారి అల్లిక జిగిబిగి
* ఒకనాడు నాచన సోమన్న
* కావ్య పరీమళము
* కావ్యానందము

* నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి
* విశ్వనాధ సాహిత్యోపన్యాసములు
* శాకుంతలము యొక్క అభిజ్ఞానత
* సాహిత్య సురభి
* నీతిగీత
* సీతాయాశ్చరితమ్ మహత్
* కల్పవృక్ష రహస్యములు
* సాహితీ మీమాంస.
@@@@@@ ఇతరములు @@@@@@
* కిన్నెరసాని పాటలు
* కోకిలమ్మ పెండ్లి
* పాము పాట
* చిన్న కథలు
* ఆత్మ కథ
* విశ్వనాధ శారద (3 భాగాలు

* యతిగీతము
* What is Ramayana to me.

ఆంధ్ర పౌరుషము నుండి ఈపద్యం ను చదవండి

గోదావరీ పావనోదార వాపూర మఖిలభారతము మాదన్న నాడు
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెల్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు
అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుకగూండ్లు గట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
రామాయణ కల్పవృక్షం నుండి.......
ఆకృతి రామచంద్ర విరహాకృతి
కన్బొమ తీరు రామ చాపాకృతి
కన్నులన్ ప్రభు క్రుపాకృతి
కైశిక మందు రామదేహాకృతి
సర్వ దేహమున యందు రాఘవ వంశ మౌళి ధర్మాకృతి
కూరుచున్న విధమంతయు రామచంద్ర ప్రతిజ్ఞ మూర్తియై.

విశ్వేశ్వర శతకము నుండి

మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!

కిన్నెరసాని పాటల నుండి

నడవగా నడవగా నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిలా తోచింది
కడు సిగ్గు పడు రాచకన్నెలా తోచింది
బెడగు పోయిన రత్నపేటిలా తోచింది.

కోకిలమ్మ పేళ్ళి నుండి......
చిలుక తల్లి మహాన్వయంబున
నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
కోకిలమ్మా తెలుగు పలుకూ
కూడబెట్టినదీ

మరొకటి......
వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
అంగనామణి పెండిలియాడి కూడ
ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె..................?????

5, డిసెంబర్ 2010, ఆదివారం

వినాయక చవితి పండుగ

వినాయక చవితి

దశరూపకాలు/దృశ్య కావ్యములు

దశరూపకాలు/దృశ్య కావ్యములు
స్టేజి పై ప్రదర్శించడానికి వీలయినవి.వీనికే రూపకములని పేరు.ఇవి 10 రకాలు.
1.నాటకము :
*ఇది ప్రఖ్యాత వస్తుకము ఉదా :రామయణం, భారతంలోని కథా వస్తువు.
*దీనిలో నాయకుడు ధీరోదాత్తుడు.5 -10 అంకాలు వస్తాయి.నాయక వధ జరగదు.
*నాయకుడు మరణించినా మళ్ళీ జీవించాలి.
*నాందీ ప్రస్తావనలతో మొదలై , భరత వాక్యంతో ముగింపు.
2.ప్రకరణము :
*ఇది కల్పిత వస్తువు.ఇందులో కథ లోక సంబందితమైనది.కవి కల్పితమై ఉండును.
*నాయకుడు ధీరశాంతుడు.అమాత్య, విప్ర , వణిజులలో ఎవరో ఒకరు నాయకుడు.
*10 అంకాలుంటాయి.నాటకానికి దీనికి భేదం ఎక్కువగా లేదు.
బాణము :
*ఇందులో కవి కల్పితమైన ధూర్తవృత్తం ఇతి వృత్తం.
*ఇందులో ఉక్తి - ప్రత్యుక్తులు ఆకాశ భాషితాలు.
4.ప్రహసనము :
*ఇది హాస్యరస ప్రధాన రూపకము.
*ఇది 3 విధాలు శుద్ధ , వికృత , సంకీర్ణ :
5.డిమము :
*ఇది ప్రఖ్యాత వస్తుకము .14 మంది ధీరోద్ధత నాయకులు ఉంటారు.
*దేవ, కిన్నెర , యక్ష , రాక్షస,భూత,ప్రేత , పిశాచాదులు.
*4 అంకాలుంటాయి.ఇందులో రౌద్రం అంగి రసము .
6. వ్యాయోగము :
*ఇది ప్రఖ్యాత వస్తుకము .ఏకాంకము .
*ధీరోద్ధతులు పలువురు ఇందులో నాయకులు.
*ప్రస్తావనాది నాట్య ధర్మములలో ఇది నాటకముతో సమానం.
7.సమావాకారము :
*దీనిలో 3 అంకాలుంటాయి. ప్రఖ్యాత వస్తువై ఉండాలి.
*దీనిలో వీరరసం అంగిరసం...మిగిలినవి అంగరసాలు..ఇందులో దేవదానవులు 12 గురు నాయకులుగా ఉంటారు.
అంకములలో కపట, ఉపద్రవాలు విడువదగినవి.
8 .వీథి :
*ఇది కల్పిత ఇతివృత్తము కలది .13 వీథి అంగములు దీనిలో ఉండాలి.
*1 - 2 పాత్రలుంటాయి. వీథి వలె అన్నింటికి మార్గం కావున దీనికాపేరు కలిగినది.
9. అంకము :
*దీనికి ఉత్సుష్టి అంకమని పేరు .
*దీనిలో వస్తువు ప్రఖ్యాతమో కవి కల్పితమో అయి ఉండాలి.
*దీనిలో ప్రధాన రసం కరుణము. నాయకులు ప్రాకృత మనుష్యులు.
*సంధులు ,వృత్తులు మొదలగు వాటిలో బాణముతో సమానము.
10.ఈహామృగము :
*ఇది మిశ్రమ వస్తుకము .దీనిలో 4 అంకములు ఉంటాయి.
*ధీరోద్దతులైన నర దివ్యులలో ఒకరు నాయకుడు...రెండవవాడు ప్రతి నాయకుడు.
*ప్రతి నాయకుడు చేతికి చిక్కినా అతనిని వధింపరాదు.
*దీనికి వ్యాయోగమునకు భేదము లేదు.
======= తూర్పింటి నరేశ్ కుమార్