మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

14, మార్చి 2010, ఆదివారం

అష్టా దశ పురాణములు

భారత దేశం అనగా వేదాలకు , పురాణాలకు పుట్టినిల్లు .
మన దేశం లో 18 పురాణాలు , 18 ఉప పురాణాలు ....108 ఉపనిషత్తులు ...వెలిశాయి.

మనము పురాణములు 18 అని చెప్పుతుంటాం.
అవియే అష్టాదశ పురాణములు . ఐతే ఈ పద్ధెనిమిది పురాణాలు.

శ్లోకము:-
మద్వయం, భద్వయంచైవ
భ్ర త్రయం వ చతుష్టయం.
అ .నా . పద్ . లిం . గ . కూ . స్కా . ని
పురాణ్యష్టాదశా స్మృతా !

తేటగీతి:-
మద్వయము భద్వయము మన మదిని గాంచ.
భ్ర త్రయము వ చతుష్టయం పరగు నరయ
గా, అ . నా . పద్మ . లిం . గ . కూ . స్కా . లనంగ
పద్ధెనిమిది పురాణముల్ పరగుచుండె.

తేటగీతి:-
మ . మ . భ . భ . భ్ర . భ్ర . భ్ర . వ . వ . వ . వ . మరల చూడ
గా, అ . నా . పద్మ . లిం . గ . కూ . స్కా . లనంగ
పద్ధెనిమిదిపురాణముల్ పరగు చుండె.

గమనిద్దామా!
మద్వయము = రెండు మాలు
1. మత్స్య పురాణము,
2. మార్కండేయ పురాణము.

భ ద్వయము = రెండు భాలు
1. భాగవత పురాణము.
2. భవిష్యత్ పురాణము.

భ్ర త్రయం = మూడు భ్
1. బ్రహ్మాండ పురాణము.
2. బ్రాహ్మ పురాణము.
3. బ్రహ్మ వైవర్త పురాణము.

వ చతుష్టయము = నాలుగు వాలు.
1. వామన పురాణము.
2. వాయవ్య పురాణము.
3. వైష్ణవ పురాణము.
4. వారాహ పురాణము.

అ = అ. > అగ్ని పురాణము.
నా = నా > నారద పురాణము.
ప > పద్మ పురాణము.
లిం > లింగ పురాణము.
గ = గ > గరుడ పురాణము.
కూ = కూ > కూర్మ పురాణము.
స్కా = స్కా > స్కాంద పురాణము.

13, మార్చి 2010, శనివారం

ఆంధ్రమహాభారతానువాదం :

ఆంధ్రమహాభారతానువాదం :

వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనే రసవద్ఘట్టాలలోనేఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించాయి .

. సంస్కృత మహాభారతం నూరు పర్వాల గ్రంధమనీ, లక్ష శ్లోకాల విస్తృతి కలిగి ఉందనీ ప్రసిద్ధి. ఆది పర్వంలో నన్నయ చెప్పిన పర్వానుక్రమణిక కూడా ఈ విషయానికి దగ్గరగానే ఉంది. ముఖ్య పర్వాలు, ఉపపర్వాలు కలిపి నూరు ఉన్నాయి. అందులో హరివంశ పర్వం భవిష్య పర్వంలో కలిసి ఉన్నది. నన్నయ తన పర్వానుక్రమణికలో హరివంశాన్ని చేర్చలేదు. తన అష్టాదశ పర్వ విభక్తంలో నూరు పర్వాలను అమర్చాడు. ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పాటించలేదు. తిక్కనాదులు నన్నయ నిర్ణయాన్ని అనుసరించారు. ఎఱ్ఱన హరివంశాన్ని వేరే గ్రంధంగా రచించాడు. ఈ విధంగా నూరు ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో పదునెనిమిది పర్వాల ఆంధ్ర మహాభారతంగా రూపు దిద్దుకొంది. తెలుగులో ఆశ్వాసాలుగా విభజించారు.

పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి వెలువడింది . అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ గళమెత్తి కలం అందుకున్నాడు . అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు. హృద్యంగా, అపూర్వంగా, అఘనిబర్హణం చేసేదిగా వుంటూ, వింటే సమగ్రమైన జ్ఞానాన్ని ఇచ్చేదే మహాకావ్యం అని నన్నయ నిర్వచించాడు. ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని..యధ్యాత్మ వేదులు నీతి శాస్త్రంబని....పద్యంలో .... భారతం ఒక విజ్ఞాన సర్వసం కనుకనే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్తము అంటారు. అధ్యాత్మ విధులు వేదాంతమంటారు. నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవి వృషభులు మహా కావ్యమనీ, లాక్షిణికులు సర్వలక్ష సంగ్రహమనీ, ఇతిహాసకులు ఇతిహాసమనీ, పరమ పౌరాణికుల పురాణ సముచ్ఛయమనీ కొనియాడతారు. భారతం విశ్వ జనీనం.
భారతాంధ్రీకరణలో నన్నయ మూడు లక్షణములు తన కవితలో ప్రత్యేకముగా చెప్పుకొన్నారు -
(1) ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి
(2) అక్షర రమ్యత
(3) నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము.
కలితార్థయుక్తి అంటే కథతో కూడుకొని ఒక మహర్దము ప్రవేశించడం. ఇది ఒక మహాశిల్పం. ఇది నన్నయ్య ఉపజ్ఞ.
భారతంలో నన్నయ సంస్కృత శబ్దములను కొన్నిచోట్ల ¸°గికార్థంలో వాడి కధార్థ యుక్తి కలిగించాడు. ఆంధ్రభాషకు నన్నయ పెట్టిన భిక్ష అక్షయం. మిగిలిన కవులందరూ ఆయన నుండి భాషా శబ్దాలు, పద్య రచనలోని ఒడుపులు గ్రహించారు కాని ఎవరికీ ఆయన ప్రసన్నకధా కలితార్థ యుక్తి మాత్రం అబ్బలేదు.

జనకుడు :

జనకుడు :
ఇతను హ్రస్వరోముని కుమారుడు.మిథిలా నగర ప్రభువు .ఇతని సోదరుడు కుశధ్వజుడు.జనకుని భార్య పేరు రత్నమాల సంతానార్థియై ఇతడు పుత్రకామేష్టి యాగాన్ని చేయటకై భూమిని దున్నిస్తున్నప్పుడు..నాగేటి చాలులో ఒక బంగారపు పెట్టెలో ...ఓ ముద్దులొలికె చిన్నారి దొరికింది.నాగేటి చాలులో దొరికినందున ఆ అమ్మాయికి సీత ' యని పేరు పెట్టారు.
జనక మహారాజు ప్రకటించిన సీతాస్వయంవరంలో శ్రీరామచంద్రుడు శివ చాపాన్ని విరిచి సీతమ్మను చేపట్టాడు. జనకుడు తన తమ్ముని కూతుర్లను రాముని తమ్ములకు ఇచ్చి వివాహం చేశాడు. జనకుడు జ్ఞాన సంపన్నుడు .గృహాస్థాశ్రమంలో నుండి స్వర్గంను పొందిన పుణ్యశాలి. ఓ రోజు యాజ్ఞవల్క్యునికి ఇతను అగ్నిహోత్రం గూర్చి చెప్పగా...అతడు సంతసించి గుణగణాలను కీర్తించి బ్రాహణత్వంను పొందుమని వరమిచ్చాడు.

జంబూ ద్వీపము :

జంబూ ద్వీపము :
మేరు పర్వతానికి దక్షిణాన గల ద్వీపమే జంబూ ద్వీపము .ఈ ద్వీపంలో గల జంబూవృక్షమును బట్టి ఈ పేరు వచ్చింది. ఈ వృక్షానికే సుదర్శనమని పేరు. దీని పొడవు 2 ,700 ల యోజనాలు .జంబూవృక్షం నుండి రాలిన పండ్ల రసం వలన ఓ నది ప్రవహించెను. అదియే జంబూనది.ఈ నదిలో నీరు త్రాగిన వారికి ఆకలి ,దప్పులు ఉండవు. ముదుసలితనం రాదు.. ఎటువంటి వ్యాధులు ధరిచేరవు....నిత్యయౌవ్వనులై శోభిల్లుతారు.
ఈద్వీపంలో 9 ఖండాలు కలవు .వీటికే వర్షములు అని పేరు. అవి వరుసగా.....1.కురువు 2. హిరణ్మయము 3.రమణకము 4.ఇలావృత్తము 5.భద్రాశ్వము 6.కేతుమాలము 7.హరివర్షము 8.భారత వర్షము 9.కింపురుషం
ఇప్పటికి మన ఇళ్ళల్లో శుభకార్యాలు చేస్తున్నప్పుడు .....భరతఖండే ...జంబూద్వీపే ....అని అనడం పరిపాటి.ఈ విధంగా జంబూద్వీపాన్ని గుర్తు చేసుకుంటాము .

నృసింహావతారము పరిచయం: వివరణ

నృసింహావతారము పరిచయం: వివరణ
శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణకై మరియు లోక కళ్యాణార్థమై
దశావతారములు ఎత్తాడు.

వాటిలో నృసింహావతారము నాల్గవది.
సంస్కృత సాహిత్యంలో అవతార గాథ కథాథ్మకంగా స్తోత్ర రత్నంగా వుంది.

తెలుగులో ఎఱ్ఱాప్రగడ మొదలైన వారు కావ్యాలు వ్రాశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 40 వరకు నృసింహా లయాలు వున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి 22 అచ్చంపేట మండలంలో ....

కల్వకుర్తి మండలంలో .....వనపర్తి మండలంలో.....
నాగర్ కర్నూల్ మండలంలో
అధికంగా ...కొల్లాపూర్ ...మక్తల్.... అలంపూర్
జడ్చర్ల మండలాల్లో ...ఒక్కోక్క నృసింహా లయాలు వున్నాయి

మహబూబ్ నగర్ మండలం కోయిలకొండలోని
నృసింహ స్వామి ఉగ్రావతారుడు.వనపర్తి మండలంలోని అంకూర్లో ,కొల్లపూర్ మండలంలోని

సింగపట్నంలో, మక్తల్ మండలంలోని ,మంగనూర్లో లక్ష్మినృసింహా ఆలయాలు వున్నాయి.
సింగపట్ట్టణం(సింగోటం) లక్ష్మినృసింహా స్వామి జాతర :
పరిచయం కొల్లపూర్ మండల కేంద్రానికి 9 కి .మీ. దూరంలో
సింగోటం(సింగపట్ట్టణం) గ్రామంలో శ్రీలక్ష్మినృసింహాస్వామి
లింగరూపంలో వెలియడాన్ని విశేషంగా చెపుతారు.
శివకేశవులకు ఆభేదం లేకుండా స్వామివారు ...

త్రిపూండ్రాలు ...ఊర్ధ్వపూండ్రాలు
కలిగి స్వయంభూఃగా ఈ ప్రాంతంలో వెలిశారు.
తదనంతర కాలంలో స్వామి ఆలయ పాదానికి కుడివైపున శివాలయ ప్రతిష్ట,
రత్నగిరికొండపై రత్నలక్ష్మీ
అమ్మవారి ప్రతిష్టను చేశారు .

శ్రీలక్ష్మినృసింహాస్వామి గోవిందా....గోవిందా..... అంటూ మిన్ను ముట్టే భక్తుల గొంతుకలతొ
సిగమెత్తే శివసత్తుల కోలాహాలంతో వేలాది భక్తుల భక్తి,పారవశ్యంతో కోలాటంవేసే భక్త మండలి ఉత్సహనందాలతో మకర సంక్రాంతి మొదలుకొని .....నెలరోజుల పాటు
ఉత్సవాలు చూపరులకు నయనాందాన్నికలుగజేస్తాయి . ప్రతీ సంవత్సరము జరిగే ఈ

జాతరకు మహబూబ్ నగర్ జిల్లాయే గాక ఇరుగు పొరుగు జిల్లావాసులతో పాటు
కర్ణాటక ,రాజస్థాన్
రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకోని తరిస్తారు.

దేవాలయ స్థల ఐతిహ్యం
జిల్లాలోని ప్రాచినమైన ప్రసిద్దినోందిన దేవాలయల్లొ

సింగపట్ట్టణం(సింగోటం) లక్ష్మినృసింహా స్వామి దేవాలయం ఒక్కటి రత్నగిరి కొండకు ఆభిముఖంగా స్వామివారు ఈ ప్రాంతంలో కొలువుదీరటానికి ముందు ఆసక్తికరమైన 600 సంవత్సరాల చారిత్రక గాథఒకటి వుంది
సురభి వంశానికి చెందిన 11వ తరంవాడైన సింగమనాయుడు 
అను భూపాలుడు జటప్రోలు ప్రాంతాన్ని కేంద్రంగా పరిపాలిస్తున్న రోజులవి.
ఆ జిల్లాలో సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక యాదవుడు 
ప్రతిదినం తెల్లవారు ఝామున గోర్కోలు చూసూకుంటూ తన పొలము లో అరక దున్నుతుంటాడు.
అపుడు లింగరూపంలో ఉన్న ఒక నల్లని సరుపరాయి నాగలికి అడ్డు తగలుతూ అతని పనికి అంతరాయం కలిగించేదట. రైతు ఆ శిలను ఎన్ని సార్లు ప్రక్కకు చేర్చినా అదే స్థలానికి చేరుతుండటంతో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు.ఆ శిల మహిమను ఆతడు గుర్తించలేకపోయాడు. ఆవిధంగా కోన్ని రోజులు గడిచాయి.........

ఆ యాదవుడు తాను పేదవాడినని, తన పనికి అంతరాయం కలుగకుండా కరుణించమని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్ధించాడు. భక్థుని మొర నిన్న శిలారూపంలోని స్వామి ఆ రాత్రి నేరుగా భూపాలుడైన ' సింగమనాయునికి ' స్వప్నరూపంలో సాక్షాత్కరిస్తాడు. ' 
తాను ఉత్తర దిశలో రెండు ఆమడల దూరంలో గల 
ఒక రైతు పొలంలో లింగరూపంలో వెలిశానని, రోజూ నాగలికి అడ్డుపడుతూ ఉన్నా రైతు తనను గుర్తించడం లేదని, ఇదే దినం తనను గుర్తించి వెంటనే ప్రతిష్ఠించి పూజలు జరుపమని " శాసించడంతో సింగమనాయుడు నిద్రనుండి ఉలిక్కిపడి లేచి తాను కలలో విన్నది, కన్నది ఇంతవరకు నిజమౌ! అనుకొని సైన్యంతో లింగ రూపంలో వున్న 
ఒక శిల కాంతివంతంగా వెలుగుతూ కనిపించింది. 
కలలో స్వామిని, ప్రజలు తోడురాగా ప్రస్తుతం వున్న ఆలయం వెనక
ఎత్తైన బండ ప్రాంతానికి రాగానే స్వామి శిలను తల పై ఎత్తుకున్న వానికి ఆవహిస్తాడు. 
తాను లక్ష్మి నృసింహున్నని చెప్పుకుంటాడు. ప్రప్రధమంగా స్వామి ప్రతిమను ఇక్కడే దించారు 
కనుక దీనికి " పాదం గుడి" అని పేరు.
సింగమ భూపాలుడు బ్రాహ్మణులైన ఓరుగంటి వంశీయుల సహకారంతో స్వామిని గంగాజలంతో అభిషేకించి  ప్రతిష్ఠించారనేది ఈ స్థల ఐతిహ్యం. అప్పట్లో స్వామి వారికి ఎండ తగలకుండా ఉండాటనికి నాపరాయితో నిర్మించిన అతి సామాన్యమైన చిన్న గుడి గర్భగుడిలో నేటికీ కనిపిస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తొది. స్వామివారువారు వెలసిన నాటి నుండినేటికి నిర్విఘ్నంగానిత్యం పూజాభిషేకాలు జరుగుతున్నాయి..

సింగపట్ట్టణం క్షేత్ర ప్రసక్తి మదన గోపాల మహాత్మ్యము అను స్థల పూరాణంలో వుంది దాని ప్రకారం పూర్వం ఇది అరణ్య ప్రాంతం. కాశి నుండి సింగవటువు అనే బ్రహ్మచారి ఈ మగతలో అతనికి "' నీవు అహోబిలం వరకు రానక్కరలేదు. ఇక్కడనే ఉండి తపస్సు చేయి అనే ఆదేశం వినిపించింది. అది విన్న అతడు అక్కడనే ఒక పురాతన ఒక పురాతన వటవృక్షాన్ని ఆశ్రయించి తపస్సు కొనసాగించాడు. కొన్ని దినాలకు స్వామికి అతని పై అనుగ్రహం అభిషేకించి కలిగి ,, పొదలి కొండపై ఒక పాదం మోపి, అక్కడి రాతిగుట్ట పై రెందో పాదం మోపీ అతనికి దర్శనమిస్తాడు. 
ఇక్కడి నృసింహా మూర్తిని లింగాకారంలో పూజిస్తున్నారు. వికారాబాద్ సమీపంలో అనంతగిరిలో నృసింహస్వామి ఈ విధంగానే ఉంటాడు.

3.4.3 స్వామి ఆకృతి :
నృసింహ స్వామి ప్రతిష్ఠ జరిపిన కాలంలోనే ఆంజనేయ ప్రతిష్ఠ జరిగింది. ఈ క్షేత్రంలో వెలసిన స్వామి లింగాకారంలో నృసింహ స్వామి. స్వామికి ఒక కన్ను క్రిందకు, ఒక కన్ను మీదకు వుంటుంది. ఎదమకన్ను క్రింద గల భాగంలో కమలం వుంది. కమలం లక్ష్మీ స్థానం కనుక స్వామి లక్ష్మీ నృసింహుడు అయ్యడు. స్వామి వెలసిన రాతికొండకు 'శ్వేతాద్రి అని పేరు.

3.4.4 రత్నలక్ష్మి అమ్మవారు : 
శ్రీలక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి అభిముఖంగా అర కిలోమిటరు దూరంలో రత్నగిరి అనే పేరుగల ఎతైన కొండ వుంది. ఆ కొండ పై రత్నలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. 
స్వామి హృదయం పై గల కమలం లక్ష్మీ స్థానం కనుక లక్ష్మీదేవి అమ్మవారు 
భక్తులకు కనిపించడం లేదు. అందువల్ల రాణి రత్నమాంబ హయాంలో 
148 సంవత్సరాల క్రితం మద్రాసు నుండి క్రీ.శ. 1857 లో రత్నలక్ష్మీదేవి 
విగ్రహాన్ని తీసికొని వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ కొండ పై ఆహ్లాదకరమైన 
వాతావరణంలో కొల్లాపూర్ రాజావారి పురాతనమైన విడిది భవనం వుంది. 
చుట్టుప్రక్కల గ్రామాల వాటికి విద్యార్ధులకు ఈ రత్నగిరి కొండ 'పిక్నిక్ స్పాట్ 'గా ఉపయోగపడుతోంది.

3.4.5 హరిహరాద్వైతం - వివాదం :

"లింగాకారం త్రిపుండ్రాంకాం -కేవలం జ్ఞానమూర్తినాం

ద్వంద్వాతీతం మహోపాశ్వం -అబేధంశివకేశవమ్ "

భావం : లింగారంలోనూ త్రిపూండ్రాలను , జ్నానమూర్తిత్త్వంలోనూ, ద్వందాతీతులైన శివ, కేశవులు అభేద స్వరూపులు. ఈ శ్లోకంలో శివ, కేశవుల అభేదం ప్రతి పాదించారు.
నృసింహాస్వామిని సింగపట్టణం క్షేత్రంలో లింగాకారంలో పూజిస్తూన్నరు. స్వామికి  త్రిపూండ్రం ఊర్ధ్వపుండ్రాలు ఉన్నాయి .కనుక ఇది హరిహరాద్వైత్వం. ఇచట పూజాదికాలు నిర్వర్తించేది స్మార్తులైన ఓరుగంటి వంశీయులు. శైవ, వైష్ణవ పట్టింపులు అధికంగా ఉన్న కాలంలో శైవులకు, వైష్ణవులకు అర్చకత్వం విషయంలో వివాదం ఏర్పదింది. అపుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబగారు పుష్పగిరి చూస్తే, స్వామి వారికి అడ్డనామాలతో పాటు నిలువు నామాలు కనిపించాయి. అందువల్ల ఈ స్వామిని దర్శించిన వైష్ణవులకు వైష్ణవుడైన ' ఎంబళ పెరుమాండ్లు ' దర్శించాలనే నియమం ఏర్పాటు చేశారు.
ఆ సమయంలోనే ఆలయపాదానికి కుడివైపున పుష్కరిణి ప్రక్కన శివాలయాన్ని కూడా నిర్మింపజేశారు. ఈ ప్రాంతపు స్మార్తులు శివ, కేశవ భేదం లేకుండా పూజాదికాలు నిర్వర్తిస్తారు. అందువలన వారికే అర్చన బాద్యతలు అప్పగించారు. ఇక్కడ స్వామి వారు హరిహరాద్వైతం అయినప్పటికీ సామాన్య ప్రజానికం వైష్ణవ రూపంలోనే గోవిందా..గోవిందా...అంటూ స్వామివారిని కొలవడం విశేషం.

3.4.6 పుష్కరిణి :
నృసింహాస్వామి ఆలయ పాదానికి కుడివైపున గల పవితర గుండంలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరించినంతనే సర్వరోగాలు హరించిపోతాయని, మనసారా స్వామిని ద్యానించి తలనీలాలు సమర్పించుకొని ఈ గుండంలో స్నానాలు చేస్తే సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ తడిబట్టలతోనే మ్రొక్కులు చెల్లించుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం.

తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఈ ప్రాంతంలోని జలాశయాలు ఎండిపోయినా ఈ పరిత్రగుండన్లో మాత్రం సర్వకాల సర్వావస్థల్లో నీరు ఉండటం ప్రత్యేకత. భక్తులు మొక్కుగా బెల్లంగడ్డలు పుశ్క్రిన్దిలో వేస్తే తమ రోగాలు స్వామి హరింపజేస్తాడనేది ఈ ప్రాంత జానపదుల విశ్వాసిం.

3.4.7 దేవాలయాభివృద్ధి : మొదట నాపరాయితో అతి సామాన్యంగానిర్మించిన ఈ దేవాలయం తర్వాతి కాలంలో అభివృద్ధికి నోచుకుంది. నిజాం కాలంలో మంత్రి అయిన చందూలాల్ బహద్దూర్ గారు ఈ దేవలయాన్ని దర్శించి దీని అభివృద్ధి నిమిత్తం 240 ఎకరాల మెట్ట,12 ఎకరాల మాగాణిని అర్చకులైన  లక్ష్మీ నరసింహయ్య శాస్త్రిగారి హయాంలో అర్చకత్వానికి రాసి ఇచ్చారు. దీన్ని 'దేవునిమాన్యం ' గావ్యవహరిస్తారు. స్వామి ప్రాచినుడైనప్పటికీ ఆలయ నిర్మాణం మాత్రం చాలాకాలం తర్వాత అనగా సన్ 1215 అనగా క్రీ.శ. 1795లో నిర్మించారు. 
గర్భగుడి 40 అంకణాల మంటపం  అర్చకుడైన రాఘవ సోమయాజి కాలంలో నిర్మించారు. ఇక్కడ గల సత్రశాలను కర్నూలు నివాసి కటకం బొర్రయ్య శెట్టి కుమారుడు బారయ్య సెట్టి శాలివాహన శకం 1819 హేవిలంబి మార్గశుద్ధ భానువారం(క్రీ.శ. 1897)లో నిర్మించాడు.
  *కొల్లాపూర్ రాణి వెంకట రత్నమాంబ గారు స్వామి గాలిగోపురం కట్టించింది.
*క్రీ.శ. 1854లో స్వామికి ఎదురుగా గల గుట్టకు రత్నగిరి అనే పేరు పేట్టి, రత్నలక్ష్మీ దేవాలయాన్ని, పద్మనిలయంఅనే విలాస భవనాన్ని  రత్నమాంబ గారు కట్టించి, తోట వేయించింది.
శాలివాహన శకం 1881 లో భక్తులు తేరును చేయించగా దినికి ఎదిరె నర్సింగరావు గారు రథశాలను కట్టించినారు.
*శాలివాహన 1886లో సురభి వెంకట జగన్నాథరావు గారు ఆలయ పాదానికి కుడివైపున గలగుండానికి
స్నానాలమెట్లు కట్టించినారు.

*1890 శ్రీమతి ఇందిరాదేవి గారి స్మారకంగా, నృసింగసాగరానికి కాలువను సురభి వంశస్థులు నిర్మించారు.

3.4.8 బ్రహ్మోత్సవాలు - జాతర : '
మకరే రవి :' అన్నట్లుగా మేషరాశి లోకి సూర్యుడు ప్రవేశించినపుడు 

ఉత్తరాయన పుణ్యకాలం వస్తుంది. ఆ సందర్భంలో సంక్రాంతి మొదలుకొని
దాదాపు నెరోజుల పాటు ఈ ప్రాంతంలో జాతర జరుగుతుంది.
జనవరి 14 వ తేదిన స్వామివారికి పూజా కైంకర్యం ,మద్యాహ్నాం మొదలుకొని 
సాయంత్రం వరకు శకటోత్సవం జరుగుతుంది. ఈ రోజున శకటోత్సవం 
విశేషంగా జరుగుతుంది. 
ఫలారం బండ్ల రోజున సింగపట్టణం చుట్టుపక్కల గ్రామాల వారు ఎద్దులను బండ్లను
అలంకరించి స్వామికి ఎదురుగా గల జమ్మిచెట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్వామి వారిని దర్శించుకోవడంతో ఉత్సవం ముగుస్తుంది.
* 15వ తేదీన స్వామి వారికి కళ్యాణోత్సవం, రధం పై మోహినీసేవ గజవాహన సేవ వుంటాయి.
*16 వ తేదీన సింహవానంతో రధం పై ప్రభోత్సవం జరుగుతుంది.
* 17వ తేదీన రధోత్సవం జరుగుతుంది. సాయంత్రం 4 -30 నిమిషాలకు దాదాపు లక్షమంది స్వామివారికి తెప్పోత్సవంను రాత్రి 8 -00 గంటల నుండి ఉ 10 -00 గంటల వరకు నిర్వహించారు.
* 19 వ తేదీన శేషవాహన సేవ, తీర్ధావళి తదనంతరం పానుపు సేవలు జరుగుతాయి.
* గత 3 సంవత్సరాల నుండి ఫొండర్ ట్రస్టీ ఆధ్వర్యంలో లక్ష్మీ నృసింహస్వామి యాగాన్ని 
లోక కళ్యాణార్ధం నిర్వహిస్తున్నరు.

3.4.9 సాహితీ సంపద :

స్వామి అవతారం నృసింహుడైనప్పటికీ  కోరిన కోర్కెలను నెరవేర్చే దైవంగా ఈ స్వామి ఖ్యతినొందారు. ఈ ప్రాంత స్వామి పై అక్షరలక్షలు విలువ చేసే సాహితీ సృష్టి జరిగింది. 

సురభి వంశంలో 26 వతరం రాజైన శ్రీవేంకట జగన్నాధరావు కాలంలో కవి సార్వభౌబిరుదాంకితుడైన  హోసదుర్గం కృష్ణమాచార్యూలు సింగపట్నం నృసింహస్వామికి
అంకితంగా"లక్ష్మీ నృసింహవిలాసం" అను సంస్కృత చంపువును రచించాడు.

"సింగపట్న నృసింహ శతకం" ను, సింగపట్టణ నరసింహ విలాసం"
"సింగపట్టణ నృసింహ క్షేత్ర మహాత్మ్యం" కావ్యాలను రచించారు.
సింగపట్టణ నృసింహశతకం మకుటం ' సింగవట నరసింహ ' సింగపట్టణం నివాసియైన శ్రీవత్సస గోత్రీకులైన ఓరుగంటి లక్ష్మీ నారాయణగారు " సింగపట్నం లక్ష్మీ నృసింహస్వామి చరితం" అను వచన్కృతిని రచించారు.
ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ--------- ' నవరత్నస్తోత్రమాల ' ను రచించారు. 

3.4.10 ప్రత్యేకతలు - ముగింపు :
* ఈక్షేత్రంలో స్వామి నృసింహుడు అయినప్పటికీ లింగరూపంలో వుంటాడు. 
స్వామికి త్రిపుండ్రాలు, ఊర్ధ్వ పుండ్రాలు వుండటం వలన స్వామి హరిహరాద్వైతంనకు 
ప్రతిరూపంగా నిలుస్తాడు.
*స్వయం భూ : అయిన స్వామికి అచకులుగా స్మార్తులైన శ్రీవత్స గోత్రీకులు, 
ఓరుగంటి వంశీయులు ఇప్పటికి కొనసాగుతూనే వున్నారు
* నృసింహస్వామికి అభిముఖంగా 1 కి.మీ. దూరంలో గిరిపై రత్న లక్ష్మీ అమ్మవారు వెలిశారు.
*సంకటాలు వున్న వారు ఈ ఆలయంలో గండదీపం మోసి తమ మ్రొక్కులను చెల్లించుకుంటారు. ఈ స్వామికి మ్రొక్కు క్రింది  గుమ్మడికాయలు సమర్పించుకుంటారు. 
గొల్లదాసరులు ఈ స్వామి సేవలో తరిస్తారు.
* భక్తులు పవిత్ర గుండలో బెల్లం గడ్డలు వేసి తమ బరువులను తొలగించుకుంటారు.
*స్వామి ఆలయ పాదానికి ఎడమవైపున నృసింహసాగరం ప్రతీ 7 సంవత్సరాలకు 
ఒకసారి మాత్రమే పూర్తిగానిండి అలుగు పారుతుంది.
* భక్తులకు స్వామి ఆవాహనయి భూత ,భవిష్యత్ కాలాలను గురించి చెప్తాడు.
*స్వయం భూ అయిన ఈ స్వామి ఏకాదికేడాది క్రమక్రమంగా పెరుగుతున్నాడని భక్తులూ విశ్వసిస్తున్నారు.

స్వామి ఆవిర్భవించిన సందర్భంలో...
స్వామి ----- నృసింహూడు, భూపాలుడు ---- సింగమనాయుడు
గ్రామం ---- సింగపట్ట్ణం, తొలి అర్చకుడు ---- నరసింహయ్య శాస్థ్రి

కాకతాళీయంగా ఒకటే కావడం వెశేషంగా చెప్పుకోవచ్చు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నొ వింతలకు, వెశేషాలకు, విశ్వాసాలకు నిలయం ఈ సింగపట్ట్ణణం. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతర ఈ ప్రాంత జనుల సంస్క్రతికి దర్పణం పడుతుంది. కుల, మత వర్గాలకు అతీతంగా జానపదులను ఒకేత్రాటి పై నడుపుతోంది. వర్తమాన పరిస్థితుల ప్రభావాన్ని తన దరికి చేరనివ్వకుండా భక్తుల పాలిట కోరిన కోర్కెల కొంగు బంగారమై ఆదర్శంగా నిలుస్తోంది.
[ఆధారం :"కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు ఒక పరిశీలన "
తూర్పింటి నరేశ్ కుమార్
]