మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

10, నవంబర్ 2010, బుధవారం

ఆదర్శ గురు శిష్యులు శుక్రాచార్య -కచులు :

ఆదర్శ గురు శిష్యులు శుక్రాచార్య -కచులు :
గురుశిష్యుల బంధానికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ ......ఇది క్షీరసాగర మథనమునకు పూర్వం జరిగిన కథ.
దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు.....
దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాలలో ఎందఱో సైనికులు అసువులు బాసేవారు.
ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి "మృతసంజీవనీ విద్య"ను సంపాదించాడు.
ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు.
వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది.
మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.
పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి.
పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి “గురుభ్యోనమః స్వామీ!!!!!
నేను ఆంగీరస గోత్రజాతుడను.... దేవగురువులైన బృహస్పతులవారి తయుడను.....నా నామధేయం కచుడు ....
విద్యార్థినై మీ వద్దకు వచ్చాను” అని ప్రార్థించాడు.
కచుని వినయానికి సంతోషించిన శుక్రుడు ...నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము
అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.

కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు.
తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.

శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు.
కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.
కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు “వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము.
కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు.
కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో “నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు.
కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి” అని ప్రార్థించింది.
శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.

ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్నిసురాపానంలో
కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ సురాపానంను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది.
శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి “ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ సురాపానం చాలా ఘోరమైనది.
దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది” అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:

“ఎంత కొంచమైననూ సురాపానం చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు
“కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను.
ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు.
కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.
అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు “సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు.
నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు” అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది
“నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”!అన్నాడు...మరి నన్ను అకారణంగా శపించినందుకు.....ఇదే నా ప్రతిశాపం....."నువ్వు విలోమ వివాహంద్వారా క్ష్యత్రియున్ని వివాహ మాడుతావని ప్రతి శాపమిచ్చాడు ".తర్వాతి కాలంలో దేవయాని యయాతి చక్రవర్తిని వివాహమాడుతుంది. ఈ కథలో మనకుతన శత్రువు దేవతల వంశం వాడైన కచునికి తన కష్టార్జితమైన మృతసంజీవనీ విద్యను శుక్రాచార్యుడు ఎటువంటి శంక లేకుండా కచునికి నేర్పడం.....కచుడు తన గురువు ఐన శుక్రాచార్యుడిని భక్తిశ్రద్దలతో కొలవడం....అవకాశం వచ్చినప్పటికిని అద్వితీయ సౌందర్య రాశి ఐన దేవయానిని వివాహమాడకపోవడం నిజంగా ,,,,,చాలా గొప్ప అంశాలు....భారతంలో కన్పిస్తాయి...ఆధునిక విద్యార్థినీ విద్యార్థులు ఈ కథను చూసి నేర్చుకోవాలి
.ఇలాంటి అంశాలు దారితప్పి భ్రష్టులౌతున్న నేటి యువత ....వీటిని చూసైన నేర్చుకోవాలి....కొంతైన సమాజం మారాలి......మార్పు తీసుకురావాలని ఆశిద్దాం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి