చిలకమర్తి లక్ష్మీనరసింహం (Chilakamarthi Lakshmi Narasimham) (1867 - 1946):
ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త.
19వ శతాబ్దం చివర, 20 వశతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల
వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు.
ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది
తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేడు.
జననం సెప్టెంబరు 26, 1867పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో
ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు.
మరణం జూన్ 17, 1946
ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టం చేత పట్టుకొన్నాడు.
1889లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరాడు. తరువాత ఇన్నీస్ పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించాడు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశాడు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపాడు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం హైస్కూల్ గా మార్చబడింది.
30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు.
ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.
1946, జూన్ 17[2] న లక్ష్మీనరసింహం మరణించాడు.పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశాడు.
కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించాడు. ఆయన వ్రాసిన నవలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశాడు. ఇంకా అనేక రచనలు చేశాడు.
1908లో ఒక ప్రెస్ స్థాపించాడు. 1916లో మనోరమ, పత్రిక అనే పత్రిక స్థాపించాడు.
దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించాడు.
లక్ష్మీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త. 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల ప్రారంభించి 13 సంవత్సరాలు నడిపాడు.
బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నాడు.
దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశాడు.* ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది.
* కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్పియర్ అని లక్ష్మీనరసింహాన్ని ప్రశంసించాడు.
* అనేక మార్లు ప్రదర్శింపబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడు పోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు (సరి చూడాలి)
* 1894లో ఆయన రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు.
* కొద్దికాలం ఆయన అష్టావధానాలు చేశాడు.
* 1897లో వ్రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాతప్రతి ప్రమాదవశాత్తు చిరిగి పోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు.
* మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించాడు.
* చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది "ఫొటోజెనిక్ మెమరీ" అని వర్ణించాడు.
* ఆయన మంచి వక్త. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవాడు.
* భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవాడు.
* ఆయన రచన గణపతి నవల హాస్యరచనలలో ఎన్నదగినది.
నాటకాలు
1. కీచక వధ -1889
2. ద్రౌపదీ పరిణయం -1889-1890
3. శ్రీరామ జననం -1889-1890
4. పారిజాతాపహరణం -1889-1890
5. సీతా కళ్యాణం -1889-1890
6. గయోపాఖ్యానం -1889-1890
7. నల చరిత్రం -1892
8. ప్రసన్నయాదవం - 1906 (ప్రదర్శింప బడింది, కాని ప్రచురింపబడలేదు)
9. నవనాటకము
నవలలు
1. రామచంద్ర విజయము - 1894 (ధారావాహిక)
2. హేమలత -1896 (చారిత్రిక నవల)
3. అహల్యాబాయి - 1897
4. సౌందర్య తిలక - 1898 - 1900
5. పార్వతీపరిణయము
6. గణపతి
కవితలు
1. పృథ్వీరాజీయము (అముద్రితం)
అనువాదాలు
1. పారిజాతాపహరణము (సంస్కృత నాటకం నుండి)
2. అభిషేక నాటకం (భాసుని సంస్కృత నాటకం నుండి)
3. స్వప్న వాసవదత్త (భాసుని సంస్కృత నాటకం నుండి)
4. మధ్యమ వ్యాయోగము (భాసునిసంస్కృత నాటకం నుండి)
5. ఋగ్వేదం (ఒక మండలం)
6. ధర్మ విజయం (పి. ఆనందాచార్యులు మహాభారత కథ ఆధారంగా అంగ్లంలో రచించిన నవల)
7. సుధా శరచ్చంద్రము - (బంకించంద్ర ఛటర్జీ ఆంగ్ల నవల "LAKE OF PALMS")
8. వాల్మీకి రామాయణం (కృష్ణమూర్తి అయ్యర్ రచన)
9. రఘుకుల చరిత్ర (కాళిదాసుని రఘువంశం నుంచి)
ఇతర రచనలు
1. రాజస్థాన కథావళి
2. మహాపురుషుల జీవిత చరిత్రలు
3. కృపాంబోనిధి
4. చిత్రకథాగుచ్ఛ
5. సమర్థ రామదాసు
6. భల్లాట శతకం
7. స్వీయ చరిత్ర
8. ప్రకాశములు (4 సంపుటములు)
9. భాగవత కథా మంజరి
10. రామకృష్ణ పరమహంస చరిత్ర
11. కాళిదాస చరిత్ర
12. చంద్రహాసుడు
13. సిద్ధార్థ చరిత్ర
11, నవంబర్ 2010, గురువారం
10, నవంబర్ 2010, బుధవారం
ఆదర్శ గురు శిష్యులు శుక్రాచార్య -కచులు :
ఆదర్శ గురు శిష్యులు శుక్రాచార్య -కచులు :
గురుశిష్యుల బంధానికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ ......ఇది క్షీరసాగర మథనమునకు పూర్వం జరిగిన కథ.
దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు.....
దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాలలో ఎందఱో సైనికులు అసువులు బాసేవారు.
ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి "మృతసంజీవనీ విద్య"ను సంపాదించాడు.
ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు.
వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది.
మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.
పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి.
పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి “గురుభ్యోనమః స్వామీ!!!!!
నేను ఆంగీరస గోత్రజాతుడను.... దేవగురువులైన బృహస్పతులవారి తయుడను.....నా నామధేయం కచుడు ....
విద్యార్థినై మీ వద్దకు వచ్చాను” అని ప్రార్థించాడు.
కచుని వినయానికి సంతోషించిన శుక్రుడు ...నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము
అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.
కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు.
తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.
శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు.
కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.
కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు “వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము.
కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు.
కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో “నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు.
కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి” అని ప్రార్థించింది.
శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.
ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్నిసురాపానంలో
కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ సురాపానంను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది.
శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి “ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ సురాపానం చాలా ఘోరమైనది.
దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది” అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:
“ఎంత కొంచమైననూ సురాపానం చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు
“కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను.
ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు.
కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.
అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు “సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు.
నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు” అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది
“నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”!అన్నాడు...మరి నన్ను అకారణంగా శపించినందుకు.....ఇదే నా ప్రతిశాపం....."నువ్వు విలోమ వివాహంద్వారా క్ష్యత్రియున్ని వివాహ మాడుతావని ప్రతి శాపమిచ్చాడు ".తర్వాతి కాలంలో దేవయాని యయాతి చక్రవర్తిని వివాహమాడుతుంది. ఈ కథలో మనకుతన శత్రువు దేవతల వంశం వాడైన కచునికి తన కష్టార్జితమైన మృతసంజీవనీ విద్యను శుక్రాచార్యుడు ఎటువంటి శంక లేకుండా కచునికి నేర్పడం.....కచుడు తన గురువు ఐన శుక్రాచార్యుడిని భక్తిశ్రద్దలతో కొలవడం....అవకాశం వచ్చినప్పటికిని అద్వితీయ సౌందర్య రాశి ఐన దేవయానిని వివాహమాడకపోవడం నిజంగా ,,,,,చాలా గొప్ప అంశాలు....భారతంలో కన్పిస్తాయి...ఆధునిక విద్యార్థినీ విద్యార్థులు ఈ కథను చూసి నేర్చుకోవాలి
.ఇలాంటి అంశాలు దారితప్పి భ్రష్టులౌతున్న నేటి యువత ....వీటిని చూసైన నేర్చుకోవాలి....కొంతైన సమాజం మారాలి......మార్పు తీసుకురావాలని ఆశిద్దాం
గురుశిష్యుల బంధానికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ ......ఇది క్షీరసాగర మథనమునకు పూర్వం జరిగిన కథ.
దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు.....
దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాలలో ఎందఱో సైనికులు అసువులు బాసేవారు.
ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి "మృతసంజీవనీ విద్య"ను సంపాదించాడు.
ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు.
వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది.
మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.
పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి.
పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి “గురుభ్యోనమః స్వామీ!!!!!
నేను ఆంగీరస గోత్రజాతుడను.... దేవగురువులైన బృహస్పతులవారి తయుడను.....నా నామధేయం కచుడు ....
విద్యార్థినై మీ వద్దకు వచ్చాను” అని ప్రార్థించాడు.
కచుని వినయానికి సంతోషించిన శుక్రుడు ...నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము
అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.
కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు.
తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.
శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు.
కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.
కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు “వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము.
కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు.
కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో “నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు.
కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి” అని ప్రార్థించింది.
శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.
ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్నిసురాపానంలో
కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ సురాపానంను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది.
శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి “ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ సురాపానం చాలా ఘోరమైనది.
దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది” అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:
“ఎంత కొంచమైననూ సురాపానం చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు
“కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను.
ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు.
కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.
అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు “సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు.
నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు” అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది
“నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”!అన్నాడు...మరి నన్ను అకారణంగా శపించినందుకు.....ఇదే నా ప్రతిశాపం....."నువ్వు విలోమ వివాహంద్వారా క్ష్యత్రియున్ని వివాహ మాడుతావని ప్రతి శాపమిచ్చాడు ".తర్వాతి కాలంలో దేవయాని యయాతి చక్రవర్తిని వివాహమాడుతుంది. ఈ కథలో మనకుతన శత్రువు దేవతల వంశం వాడైన కచునికి తన కష్టార్జితమైన మృతసంజీవనీ విద్యను శుక్రాచార్యుడు ఎటువంటి శంక లేకుండా కచునికి నేర్పడం.....కచుడు తన గురువు ఐన శుక్రాచార్యుడిని భక్తిశ్రద్దలతో కొలవడం....అవకాశం వచ్చినప్పటికిని అద్వితీయ సౌందర్య రాశి ఐన దేవయానిని వివాహమాడకపోవడం నిజంగా ,,,,,చాలా గొప్ప అంశాలు....భారతంలో కన్పిస్తాయి...ఆధునిక విద్యార్థినీ విద్యార్థులు ఈ కథను చూసి నేర్చుకోవాలి
.ఇలాంటి అంశాలు దారితప్పి భ్రష్టులౌతున్న నేటి యువత ....వీటిని చూసైన నేర్చుకోవాలి....కొంతైన సమాజం మారాలి......మార్పు తీసుకురావాలని ఆశిద్దాం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)