మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

15, జులై 2016, శుక్రవారం

కాళోజి నాగొడవ

కాళోజి నాగొడవ :

ఒక్క సిరా చుక్క
వెయ్యిమెదళ్ళ కదలిక- అంటాడు కాళోజి.
తెలుగు సమాజంలో ప్రజా సమస్యలను చూసి తన రచనా ప్రక్రియ ద్వారా అనేక మంది మెదళ్ళను కదిలించి చైతన్యవంతం చేసిన కార్యశీలి కాళోజి. కాళోజి ఆశు కవి. ఆశువుగా అనేక కవితల్ని తన గళం నుండి జారవిడిచాడు. సమాజంలో అన్యాయం ఎక్కడుంటే అక్కడ ఆయన కవిత అక్కడుంటుంది. ఆయన మాట అక్కడుంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం మనిషికి అనేక హక్కులు ఏర్పడ్డాయి అని, ఆ హక్కులను హరించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుంది?- అని మానవ హక్కుల కోసం అనేక సార్లు జైలు పాలయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అణచివేతకు, దోపిడీకి, అక్రమాలకు ఎగిరే ధిక్కార పతాకమైండు. బడి పలుకుల భాష కాదు మాకు కావల్సింది, పలుకుబడుల భాష కావాలని ప్రశ్నించిన వ్యక్తి కాళోజి నారాయణ.

కాళోజి జీవిత ప్రస్థానం దాదాపు 10 దశాబ్దాల కిందట కన్నడ ప్రాంతంలో ప్రారంభమైంది. 1914 సెప్టెంబర్‌ 9న బీజాపూర్‌ జిల్లాలోని రట్టహాళి గ్రామంలో జన్మించాడు. తండ్రి రంగారావు, తల్లి రమాబాయి. కాళోజి జననం తర్వాత రెండు సంవత్సరాలు వారి కుటుంబం హన్మకొండ దగ్గర కాజీపేటకు సమీపంలోని మడికొండకు వచ్చి స్థిరపడింది. కాళోజీ అసలు పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాస రావు రాజా కాళోజి. ఇంత పెద్ద పేరు ఇబ్బందని కాళోజి నారాయణ రావుగా మార్చుకున్నారు. ఈయన అమ్మ రమాబాయమ్మ కన్నడ ప్రాంతం- తండ్రి రంగారావు మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి. వీరికి ఇద్దరు సంతానం. వీరిలో పెద్దవాడు కాళోజి రామేశ్వర రావు- షాద్‌ అనే కలం పేరుతో ఉర్దు కవిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. రెండవ వ్యక్తి కాళోజి నారాయణ రావు. తల్లి కన్నడం తండ్రి మహారాష్ట్ర కావడంతో కాళోజి రెండు భాషల్లో పట్టు సాధించి, తెలంగాణ ప్రాంతంలో స్థిరపడటం వల్ల తెలుగులో కూడా మంచి ప్రావీణ్యం పొందారు. ఒక్క సిరా చుక్క వెయ్యిమెదళ్ళ కదలిక అంటాడు కాళోజి.

రచనలు:
ప్రజాకవి కాళోజి ప్రజల కష్టాలను పంచుకున్న వ్యక్తి. సమాజంలో నాటి తెలంగాణ ఉద్యమంలో తాను అనుభవించిన అనేక సంఘటనలను, ప్రజల బాధలను చూసి చలించాడు. ఇలా సమాజంలో దుర్మార్గాన్ని కడతేర్చడానికి కాళోజి తన కవిత్వాన్ని ఆయుధంగా వాడుకొని తన కలంతో, గళంతో అనేక రచనలను జాలువారించాడు. అందులో అణా కథలు (1941), కాళోజి కథలు (1945), పార్థిక వ్యయము (1948), నా గొడవ (1953), జీవన గీతాలు (1968), తెలంగాణ ఉద్యమ కవితలు (1969) కాళోజి కథలు (2000), తుది విజయం మనది నిజం, నా గొడవ పరాభవ వసంత, నాగొడవ పరాభవ గ్రీష్మం, నాగొడవ పరాభవ వర్షం, నాగొడవ పరాభవ శరత్తు, నాగొడవ పరాభవ హేమంతం, నాగొడవ పరాభవ శిశిరం, బంగ్లాదేశ్‌ కవితలు, మరాఠి భాష నుండి ఎన్‌. జి. ఫడ్కే నవల (అంజలి), సానే గురుజీ రచనలను (భారతీయ సంస్కృతి) కాళోజి సరళమైన తెలుగులోనికి అనువదించారు. తెలంగాణ సామాజిక, రాజకీయ, సాహిత్య ఉద్యమాలను, చరిత్రకు దర్పణంగా కాళోజి చెపుతుండగా తూర్పు మల్లారెడ్డి తన ఆత్మకథను- నా గొడవ- అను పేరుతో రాశారు కాని, అది అసంపుర్ణం, ఇలా దాదాపు 70 రచనల వరకు రచించగా, వీటిలో మనకు కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి.

కాళోజి తెలుగు వాడా?:
అసలు కాళోజి తెలుగు వాడా అనే చర్చ కొన్ని రోజులు అనేక విమర్శలకు దారి తీసింది. తండ్రి మహారాష్ట్ర, తల్లి కర్ణాటక. వీరిద్దరు వేర్వురు ప్రాంతాలకు చెందినవారు వలస కోసం వరంగల్లుకు వచ్చారు కాబట్టి ఈయన తెలుగు వాడు ఎలా అవుతాడు, తెలుగు వాడు కాని వ్యక్తిని ప్రజాకవిగా తెలుగులో ఎలా గుర్తిస్తారు? అని చాలా మంది వ్యతిరేకించారు. కాని దీన్ని చాలా మంది కవులు, పండితులు, నాయకులు ఖండించారు. తన తల్లి తండ్రిది కర్ణాటక, మహారాష్ట్ర కావచ్చు కాని తాను తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడి మట్టిలోనే జీవనం కొనసాగించాడు. మానవ హక్కుల నేతగా తెలుగు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు అడ్డు నిలిచి నిజాం సర్కారును సైతం వ్యతిరేకించిన ధిక్కార స్వరం కాళోజి. ప్రజలే ఊపిరిగా భావించి ఎక్కడ అన్యాయం, అణచివేత జరిగితే తన సాధ్యా సాధ్యాల మేరకు తన కలంతో, గళంతో సామాన్య ప్రజల చెంత చేరి వరంగల్‌ నగర బహిష్కరణకు కూడా గురై, ఎంతో మంది ప్రజాసంఘాలవారితో కలిసి అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి కాళోజి. అలాంటి వ్యక్తి తెలుగు వాడు కాడా, తెలంగాణ వాడు కాదా- అని అంటే తెలుగు వాడే, తెలంగాణ వాడే అని నిక్కర్షగా చెప్పవచ్చు.

కవిగా కాళోజి:
వరంగల్‌ జిల్లా కొంత చైతన్యవంతమైన జిల్లా. అనేక మంది కవులకు పురిటి గడ్డ. అలాంటి ప్రాంతంలో కాళోజి కవిగా తొలి అడుగులు వేయడానికి- కొంత మంది పెద్దల ప్రభావం కూడా అతని పై పడింది. ముఖ్యంగా కాళోజి గార్లపాటి రాఘవరెడ్డితో ఉన్న సహచర్యం వల్ల కవితా రచనకు ప్రేరణ కల్గింది. రాఘవరెడ్డి యే కవితా రచనకు సంబంధించిన యతి, ప్రాసల ప్రయోగ విధానాన్ని గూర్చి మాత్రా ఛందస్సుల నడకలను గూర్చి నేర్పారు. నిరంతర అభ్యాసంతో తన కవితా రచనకు ఒరవడి దిద్ది, ఆనందమో, ఆవేదనో కలిగినప్పుడల్లా, తనకు వచ్చిన భావాలను కవితా రూపంలో వ్యక్తం చేశాడు కాళోజి (నా గొడవ 1953 కాళోజి పీఠిక నుండి). ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అయితే, కాళోజి గొడవంతా సగటు మనిషి గొడవ. అందుకే కాళోజి ప్రజాకవి అయినాడు. సామాన్య ప్రజల బాధలను వారికి అర్థమయ్యే విధంగా సులభ పదాలతో అతి సున్నితంగా ప్రజలకు చేరవేసేవాడు. అందుకే ప్రజలకు అంత దగ్గరయ్యాడు అనడంలో ఆశ్చర్యం లేదు. ఏ సాహిత్య ప్రక్రియలో అయినా రెండు ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి వస్తువు అయితే, రెండవది శిల్పం. గొప్ప రచనల్లో ఈ రెండు దేనికదే చలామణి అవుతూ ఒకే విధంగా కలిసిపోతాయి. వాస్తవానికి ఈ రెండు వేర్వేరు కావని, ఒకటేనని గొప్ప కవిత్వంలో ఈ రెండు కలిసి పోతాయని విమర్శకులంటారు. ఈ రెండింటిలో కాళోజి- ఏం చెబుతున్నామన్నది ముఖ్యం కాని, ఎట్లా చెపుతున్నామన్నది ముఖ్యం కాదు అంటాడు. అంటే భాష విషయంలో తగిన జాగ్రత్త వహించలేదు. సాదా సీదా మాటలలో తన కవిత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాడు. ఈ విషయానికి వస్తే కాళోజి వేమన, శ్రీశ్రీ మార్గాన్నే ఎంచుకున్నాడని చెప్పవచ్చు.

నాకున్నది కోరిక / నా గొడవ నీకు రాసిన ఉత్తరంగా ఉండాలని / చదువులకు కవిత్వంగా ఉండాలని/ భావుకులకు మెదడుగా ఉండాలని/ అమాయకులకు ఆపద గుర్తించేదిగా ఉండాలని/ విచ్చలవిడి ఆంబోతులకు గుదిబండగా ఉండాలని/ నాకున్నది కోరిక.
కవిత్వం అనేది నిరంతర ప్రవాహి. నిత్యం గోదావరిలా పొర్లి పొంగుతూ ఆనందపు, బాధల గాథలతో సాగిపోతుంది. కాని కవిత్వం అనేది- కళ కళ కోసంగా కాకుండా, ఎదుటి వ్యక్తికి ప్రతీకగా, ప్రజల పక్షాన నిలబడి ఆంబోతులకు గుదిబండగా ఉండాలని అంటాడు. అంటే కళ కళ కోసం కాదు- కళ ప్రజల కోసం ఉండాలంటాడు కాళోజి.
ప్రజలను హింసించు ప్రభువు మాకేల
వధియింప భక్షింప వన రాజులేడా.
నిజాం రాజరికంలో ప్రజలపై అణచివేత, దోపిడీ, హింసా ఖండనలు, మానభంగాలు ప్రతి రోజు కొనసాగుతుంటే నిజాం ప్రభువు తనకేమి సంబంధం లేనట్టు తన సంస్థానంలో హాయిగా రాణివాసంలో కులుకు తున్నాడు. ప్రజల యోగక్షేమాలకే పరిపాలనా విధానం ఉండాలి కాని భక్షించటానికి కాదని నిజాం రాజును ప్రశ్నించాడు.

తెలంగాణ పై కాళోజి అభిప్రాయం:
తెలంగాణ సాహిత్యంలో కాళోజికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ సాహిత్యం అనగానే మొదటి వరుసలో ఉండే వ్యక్తి కాళోజి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు ఆశపడి తెలంగాణనే ఊపిరిగా, తుది శ్వాస వరకు తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్న వ్యక్తి ప్రజాకవి కాళోజి. పెద్ద మనుష్యుల ఒప్పందం ప్రకారం కొన్ని షరతులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తో కలిసినది. పెద్దమనుష్యుల ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలు.
1. తెలంగాణ ప్రాంత విధాన సభ్యులు తెలంగాణ ప్రాంతీయ సంఘానికి సభ్యులుగా ఉండగలరు. ప్రాంతీయ సంఘం తెలంగాణ అభివృద్ధి నిమిత్తం విధానాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవలెను. 2. తెలంగాణ మొత్తం ఆదాయంలో కొంత రాష్ర్టం పై వ్యయం కాగా, మిగులు నిధులు తెలంగాణ ప్రాంత అభివృద్ధి నిమిత్తం వ్యయం చేయవలె. 3. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియమాలకు తెలంగాణ ప్రాంతంలో 15 సంవత్సరాల నుండి నివసించే వ్యక్తులనే నియమించాలి. 4. తెలంగాణ ప్రాంతీయుని ముఖ్యమంత్రిగా లేదా ఉప ముఖ్యమంత్రిగా నియమించాలి.

- ఈ ఒప్పందం ప్రకారం పరిపాలన జరగలేదు. తెలంగాణలో అనేక మంది యువకులు, విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నకిలి ముల్కి ద్వారా ఆంధ్ర ప్రాంతపు వ్యక్తులే అనేక ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. తెలంగాణ ఎన్‌.జి.వొ. లకు ప్రమోషన్లు లేవు. అనేక సంవత్సరాలు గడిచినా సీనియార్టి లిస్టు తయారు కాలేదు. దీంతో పాటు తెలంగాణ భాష, యాస విషయంలో చిన్న చూపును చూసి కాళోజి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. అందుకే తన కలంతో అనేక తూటాలు పేల్చాడు. బూర్గునాటి ఒప్పందం, బట్టదాఖలైనప్పుడు/ విన్నపాలు విజ్ఞప్తులు, వినునాధులే లేనప్పుడు/ తెలంగాణ సిబ్బందిది త్రిశంకు గతి అయినప్పుడు - అంటూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయాడు. ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణకు రావలసినవి అడుగుతే అసలు వినే నాధుడే లేడు- అని ఇంతటి దుర్మార్గపు పరిస్థితి ఇంకోటి ఉండదంటూ కలతచెందాడు. తెలంగాణ బలము జాడ ఇల కడుపున మెదలుతాంది/ తెలంగాణ కృష్ణుడి వలె, మొలుస్తోంది జైలు లోన/ బ్రహ్మనందుడు కంసుడు, బలుస్తాండు జేలివతల- 1969 లో తెలంగాణ ఉద్యమం ఒక పెను తుఫానులా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం పురుటి నొప్పులు పడుతున్నదని, పాలించే రాషా్టన్న్రి ప్రశ్నించే యువకులు తయారయ్యారని ఇతిహా స పాత్రలతో కాళోజి- కౌరవులు ఎంత మంది ఉన్నా, ఎన్ని ఎత్తులు వేసినా చివరకు పాండ వులే నిలిచారని, తెలంగాణలో కూడా అంతే అంటూ- ఈ ప్రాంతాన్నేలే ముఖ్యమంత్రిని గద్దె దించడానికి తెలంగాణ ప్రజానీకం బలపడుతుందని తెలుపుతున్నాడు.

రెండున్నర జిల్లాలదె, దండి భాష అయినప్పుడు/ తక్కినోళ్ళ నోళ్ళ యాస, తొక్కి అణచబడ్డప్పుడు/ ప్రత్యేకంగా రాజ్యం పాలు, అడగ తప్పదన్నాడు. తెలంగాణకు భాష విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రజల భాష అందరికి సౌకర్యంగా ఆమోదయోగ్యంగా ఉండాలి కాని, కేవలం రెండున్నర జిల్లాల భాషనే ప్రామాణిక భాష అనడం ఎంత వరకు సమంజసం? నా తెలంగాణ భాషను, యాసను అణచివేయడం, కించపరచడం, తొక్కివేడం ఎందుకు? అని ప్రశ్నించి, మా భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని, మీతో మాకేంటి అని- ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఉండాల్సిన అవసరం అని చెప్పారు. అలాగే భాష విషయంలో తప్పొప్పులను చెబుతూ- చాయ్‌ అంటే తప్పా, టీ అంటే రైటా/ నాష్ట అంటే తప్పా, టిఫిన్‌ అంటే రైటా/ సడక్‌ అంటే తప్పా, రోడ్డంటే రైటా? సీమాంధ్ర వారు- మీరు ఎక్కువ ఉర్దూ పదాలు ఎక్కువ వాడతారు, మీ భాష సరికాదు - అన్నప్పుడు కాళోజి మీరు ఇంగ్లీష్‌ పదాలు ఎందుకు వాడుతున్నారు, మీదేమో రైటు, మాదేమో తప్పా అంటూ ప్రశ్నించాడు. అందుకే భాష విషయంలో బడి పలుకుల భాష మీదైతే పలుకుబడుల భాష మాదన్నాడు. ప్రాంతేతరుడే దోపిడీ చేస్తే/ దూరం దాక తన్ని తరుముతాం/ ప్రాంతీయుడే దోపిడీ చేస్తే/ ప్రాంతంలోనే పాతర వేస్తాం. - ఈ సమాజంలో దోపిడీ చేసే వాడు మనవాడు కావచ్చు, పక్క రాష్ట్రం వాడు కావచ్చు. ఎవడైనా ప్రజలకు అన్యాయం చేస్తే తరిమేయడమో, పాతరేయడమో తప్పదని సూటిగా చెప్పిన వ్యక్తి కాళోజి.                                        SURYA News paper 2014
===================================================================
http://www.koumudi.net/Monthly/2014/may/may_2014_vyAsakoumudi_kaloji.pdf
=========================================================================
కాళోజి



`ప్రభుత్వ టెర్రరిజాన్ని విమర్శించే మీరు పద్మ విభూషణ్ ఎందుకు పుచ్చుకున్నార`ని అడిగాను. కాళోజి అందుకు సంజాయిషీ కథ చెప్పారు. వరంగల్లులో వుంటున్న తనకు ప్రధాని పి.వి. నరసింహారావు నుండి ఫోను వచ్చిందట. ఇంట్లో ఫోను లేనందున, కలెక్టరేట్ కు ఫోను చేసి పిలిపించమన్నారట. డెఫ్యూటి కలెక్టర్ జీపులో వచ్చి కలెక్టర్ గారు పిలుస్తున్నారు రమ్మంటే, సరేనని జీపు ఎక్కి, అడిగారట. నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి తీసుకెడుతున్నారా అని. ఆయన నవ్వి. లేదండీ, ఢిల్లీ నుండి మీకు ఫోను వచ్చిందట, అందుకని అన్నారట. కలెక్టరేట్ లో సాదరంగా ఆయన్ను కూర్చోబెట్టి, ప్రధాని నరసింహారావుకు ఫోను కలిపారట. కాళన్నా, నీవు అన్నీ వద్దంటావు. కాని యీ సారి అలా అనొద్దు. పద్మ విభూషణ్ స్వీకరించడానికి ఒప్పుకో అంటే, కాళోజీ `సరే` అన్నారట.
పి.వి. నరసింహారావు, కాళోజీ చిరకాల మిత్రులు. ఒరే అనే టంత చనువు వున్న స్నేహితులు, దీని వెనుక వేరే కథ వుంది. స్టేజి, డ్రామాలలో ఆరితేరిన ఎ.ఆర్. కృష్ణకు పద్మభూషణ్ యివ్వమని సిఫారసు చేస్తూ, కాళోజీ రాసిన లేఖ అందుకున్న ప్రధాని పి.వి. నరసింహారావుకు ఆలశ్యంగా గంట కొట్టిందట- కాళోజీకి పద్మభూషణ్ యివ్వాలని. ఎ.ఆర్. కృష్ణకు పద్మశ్రీ యిచ్చారు. మొత్తం మీద శ్రీశ్రీ వలె కాళోజీ కూడా ప్రభుత్వ లాంఛనాలకు మెత్తబడ్డారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి, జైళ్ళ పాలైన కాళోజి, గేయాలు రాసి, ప్రజాకవిగా పేరొందారు. సాధారణ జీవితం గడుపుతూ గాంధేయుడి వలె నివశించారు.
కాళోజీతో పరిచయమైన తరువాత ఉభయులం కొన్ని సార్లు కలసి భోంచేశాం, ఔపోశనం పట్టాం. కాళోజీ నాన్ వెజి టేరియన్ తినేవాడు. ఇష్టం గా రం తాగేవాడు. తాపీగా భోజనం చేస్తూ బోలెడు కబుర్లు చెప్పేవాడు.
కాళోజి ఒక సారినాతో అన్నాడు. తప్పుడు ప్రదేశాల్లో గుచ్చినా సరే, అక్యు పంక్చర్ సూదులు, పనిచేస్తున్నాయట అని. నేను అశాస్త్రీయ చికిత్సలను విమర్శిస్తున్నట్లు తెలిసి, నన్ను సమర్థిస్తూ, వ్యంగ్యంగా అక్యుపంక్చర్ వైద్యులను దెప్పిపొడిచారు.
కాళోజి గేయాలు చదివాను. సింపుల్ గా సూటిగా వుంటాయి. నాగొడవ పేరిట రాసిన గేయాలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళాయి. ఉద్యమాలలో పాల్గొన్న కాళోజి, గాంధి, నెహ్రూ, రాజాజీ ఎం.ఎన్. రాయ్ ను మెచ్చుకునేవారు. రాయ్ ను యూనివర్శల్ పర్సన్ అనేవారు.  కాళోజీ, 1969 లో ప్రత్యేక తెలంగాణాను సమర్ధించి, అలాగే నిలిచిపోయారు.
నక్సలైట్ ఎన్ కౌంటర్ల విషయంలో స్పందించిన కాళోజీ, పౌర హక్కుల సంఘ సమావేశాలలో పాల్లొన్నారు. అప్పుడు తరచు కలిసే వాళ్ళం.
1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు కాళోజీ. డిపాజిట్ పోయింది. కాని ఆయనకు మహిళా సంఘాలు, అభ్యుదయ సంఘాలు మద్దత్తు యిచ్చాయి. ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతటా పర్యటించాల్సిన వెంగళరావు, తన నియోజక వర్గానికి అతుక్కుపోయి, పోటీ తీవ్రంగా తీసుకోవడం గమనార్హం. అప్పుడు ఆంధ్రజ్యోతి దిన పత్రిక బ్యూరో ఛీఫ్ గా, నేను సత్తుపల్లి వెళ్ళి, కాళోజీని కలసి, మెచ్చుకున్నాను.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కాళోజి జర్నలిస్టులతో కలిసి, మద్యం సేవిస్తూ కబుర్లు చెప్పేవారు. కొన్నాళ్ళు హైదరాబాద్ లోని హనుమాన్ టేకిడిలో నివసించారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా ఫెన్షన్ రావడంతో, ఆయనకు ఆర్థికంగా వెసులు బాటు లభించింది. బాగా వృద్ధాప్యం వచ్చే వరకూ, కాళోజి జీవించారు. ఆయనతో కాలక్షేపం ఎప్పుడూ ఆహ్లాదంగానే వుండేది.
రచనలు : నాగొడవ (గేయాలు), లంకా పునరుద్ధరణ (కథలు).
అనువాదాలు : ఖలీల్ జీబ్రాన్, దిప్రాఫెట్, రెబెల్ ఇండియా.




కాళోజి నాగొడవ

కాళోజి నాగొడవ :

ఒక్క సిరా చుక్క
వెయ్యిమెదళ్ళ కదలిక- అంటాడు కాళోజి.
తెలుగు సమాజంలో ప్రజా సమస్యలను చూసి తన రచనా ప్రక్రియ ద్వారా అనేక మంది మెదళ్ళను కదిలించి చైతన్యవంతం చేసిన కార్యశీలి కాళోజి. కాళోజి ఆశు కవి. ఆశువుగా అనేక కవితల్ని తన గళం నుండి జారవిడిచాడు. సమాజంలో అన్యాయం ఎక్కడుంటే అక్కడ ఆయన కవిత అక్కడుంటుంది. ఆయన మాట అక్కడుంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం మనిషికి అనేక హక్కులు ఏర్పడ్డాయి అని, ఆ హక్కులను హరించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుంది?- అని మానవ హక్కుల కోసం అనేక సార్లు జైలు పాలయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అణచివేతకు, దోపిడీకి, అక్రమాలకు ఎగిరే ధిక్కార పతాకమైండు. బడి పలుకుల భాష కాదు మాకు కావల్సింది, పలుకుబడుల భాష కావాలని ప్రశ్నించిన వ్యక్తి కాళోజి నారాయణ.

కాళోజి జీవిత ప్రస్థానం దాదాపు 10 దశాబ్దాల కిందట కన్నడ ప్రాంతంలో ప్రారంభమైంది. 1914 సెప్టెంబర్‌ 9న బీజాపూర్‌ జిల్లాలోని రట్టహాళి గ్రామంలో జన్మించాడు. తండ్రి రంగారావు, తల్లి రమాబాయి. కాళోజి జననం తర్వాత రెండు సంవత్సరాలు వారి కుటుంబం హన్మకొండ దగ్గర కాజీపేటకు సమీపంలోని మడికొండకు వచ్చి స్థిరపడింది. కాళోజీ అసలు పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాస రావు రాజా కాళోజి. ఇంత పెద్ద పేరు ఇబ్బందని కాళోజి నారాయణ రావుగా మార్చుకున్నారు. ఈయన అమ్మ రమాబాయమ్మ కన్నడ ప్రాంతం- తండ్రి రంగారావు మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి. వీరికి ఇద్దరు సంతానం. వీరిలో పెద్దవాడు కాళోజి రామేశ్వర రావు- షాద్‌ అనే కలం పేరుతో ఉర్దు కవిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. రెండవ వ్యక్తి కాళోజి నారాయణ రావు. తల్లి కన్నడం తండ్రి మహారాష్ట్ర కావడంతో కాళోజి రెండు భాషల్లో పట్టు సాధించి, తెలంగాణ ప్రాంతంలో స్థిరపడటం వల్ల తెలుగులో కూడా మంచి ప్రావీణ్యం పొందారు. ఒక్క సిరా చుక్క వెయ్యిమెదళ్ళ కదలిక అంటాడు కాళోజి.

రచనలు:
ప్రజాకవి కాళోజి ప్రజల కష్టాలను పంచుకున్న వ్యక్తి. సమాజంలో నాటి తెలంగాణ ఉద్యమంలో తాను అనుభవించిన అనేక సంఘటనలను, ప్రజల బాధలను చూసి చలించాడు. ఇలా సమాజంలో దుర్మార్గాన్ని కడతేర్చడానికి కాళోజి తన కవిత్వాన్ని ఆయుధంగా వాడుకొని తన కలంతో, గళంతో అనేక రచనలను జాలువారించాడు. అందులో అణా కథలు (1941), కాళోజి కథలు (1945), పార్థిక వ్యయము (1948), నా గొడవ (1953), జీవన గీతాలు (1968), తెలంగాణ ఉద్యమ కవితలు (1969) కాళోజి కథలు (2000), తుది విజయం మనది నిజం, నా గొడవ పరాభవ వసంత, నాగొడవ పరాభవ గ్రీష్మం, నాగొడవ పరాభవ వర్షం, నాగొడవ పరాభవ శరత్తు, నాగొడవ పరాభవ హేమంతం, నాగొడవ పరాభవ శిశిరం, బంగ్లాదేశ్‌ కవితలు, మరాఠి భాష నుండి ఎన్‌. జి. ఫడ్కే నవల (అంజలి), సానే గురుజీ రచనలను (భారతీయ సంస్కృతి) కాళోజి సరళమైన తెలుగులోనికి అనువదించారు. తెలంగాణ సామాజిక, రాజకీయ, సాహిత్య ఉద్యమాలను, చరిత్రకు దర్పణంగా కాళోజి చెపుతుండగా తూర్పు మల్లారెడ్డి తన ఆత్మకథను- నా గొడవ- అను పేరుతో రాశారు కాని, అది అసంపుర్ణం, ఇలా దాదాపు 70 రచనల వరకు రచించగా, వీటిలో మనకు కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి.

కాళోజి తెలుగు వాడా?:
అసలు కాళోజి తెలుగు వాడా అనే చర్చ కొన్ని రోజులు అనేక విమర్శలకు దారి తీసింది. తండ్రి మహారాష్ట్ర, తల్లి కర్ణాటక. వీరిద్దరు వేర్వురు ప్రాంతాలకు చెందినవారు వలస కోసం వరంగల్లుకు వచ్చారు కాబట్టి ఈయన తెలుగు వాడు ఎలా అవుతాడు, తెలుగు వాడు కాని వ్యక్తిని ప్రజాకవిగా తెలుగులో ఎలా గుర్తిస్తారు? అని చాలా మంది వ్యతిరేకించారు. కాని దీన్ని చాలా మంది కవులు, పండితులు, నాయకులు ఖండించారు. తన తల్లి తండ్రిది కర్ణాటక, మహారాష్ట్ర కావచ్చు కాని తాను తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడి మట్టిలోనే జీవనం కొనసాగించాడు. మానవ హక్కుల నేతగా తెలుగు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు అడ్డు నిలిచి నిజాం సర్కారును సైతం వ్యతిరేకించిన ధిక్కార స్వరం కాళోజి. ప్రజలే ఊపిరిగా భావించి ఎక్కడ అన్యాయం, అణచివేత జరిగితే తన సాధ్యా సాధ్యాల మేరకు తన కలంతో, గళంతో సామాన్య ప్రజల చెంత చేరి వరంగల్‌ నగర బహిష్కరణకు కూడా గురై, ఎంతో మంది ప్రజాసంఘాలవారితో కలిసి అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి కాళోజి. అలాంటి వ్యక్తి తెలుగు వాడు కాడా, తెలంగాణ వాడు కాదా- అని అంటే తెలుగు వాడే, తెలంగాణ వాడే అని నిక్కర్షగా చెప్పవచ్చు.

కవిగా కాళోజి:
వరంగల్‌ జిల్లా కొంత చైతన్యవంతమైన జిల్లా. అనేక మంది కవులకు పురిటి గడ్డ. అలాంటి ప్రాంతంలో కాళోజి కవిగా తొలి అడుగులు వేయడానికి- కొంత మంది పెద్దల ప్రభావం కూడా అతని పై పడింది. ముఖ్యంగా కాళోజి గార్లపాటి రాఘవరెడ్డితో ఉన్న సహచర్యం వల్ల కవితా రచనకు ప్రేరణ కల్గింది. రాఘవరెడ్డి యే కవితా రచనకు సంబంధించిన యతి, ప్రాసల ప్రయోగ విధానాన్ని గూర్చి మాత్రా ఛందస్సుల నడకలను గూర్చి నేర్పారు. నిరంతర అభ్యాసంతో తన కవితా రచనకు ఒరవడి దిద్ది, ఆనందమో, ఆవేదనో కలిగినప్పుడల్లా, తనకు వచ్చిన భావాలను కవితా రూపంలో వ్యక్తం చేశాడు కాళోజి (నా గొడవ 1953 కాళోజి పీఠిక నుండి). ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అయితే, కాళోజి గొడవంతా సగటు మనిషి గొడవ. అందుకే కాళోజి ప్రజాకవి అయినాడు. సామాన్య ప్రజల బాధలను వారికి అర్థమయ్యే విధంగా సులభ పదాలతో అతి సున్నితంగా ప్రజలకు చేరవేసేవాడు. అందుకే ప్రజలకు అంత దగ్గరయ్యాడు అనడంలో ఆశ్చర్యం లేదు. ఏ సాహిత్య ప్రక్రియలో అయినా రెండు ప్రధాన అంశాలు ఉంటాయి. ఒకటి వస్తువు అయితే, రెండవది శిల్పం. గొప్ప రచనల్లో ఈ రెండు దేనికదే చలామణి అవుతూ ఒకే విధంగా కలిసిపోతాయి. వాస్తవానికి ఈ రెండు వేర్వేరు కావని, ఒకటేనని గొప్ప కవిత్వంలో ఈ రెండు కలిసి పోతాయని విమర్శకులంటారు. ఈ రెండింటిలో కాళోజి- ఏం చెబుతున్నామన్నది ముఖ్యం కాని, ఎట్లా చెపుతున్నామన్నది ముఖ్యం కాదు అంటాడు. అంటే భాష విషయంలో తగిన జాగ్రత్త వహించలేదు. సాదా సీదా మాటలలో తన కవిత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాడు. ఈ విషయానికి వస్తే కాళోజి వేమన, శ్రీశ్రీ మార్గాన్నే ఎంచుకున్నాడని చెప్పవచ్చు.

నాకున్నది కోరిక / నా గొడవ నీకు రాసిన ఉత్తరంగా ఉండాలని / చదువులకు కవిత్వంగా ఉండాలని/ భావుకులకు మెదడుగా ఉండాలని/ అమాయకులకు ఆపద గుర్తించేదిగా ఉండాలని/ విచ్చలవిడి ఆంబోతులకు గుదిబండగా ఉండాలని/ నాకున్నది కోరిక.
కవిత్వం అనేది నిరంతర ప్రవాహి. నిత్యం గోదావరిలా పొర్లి పొంగుతూ ఆనందపు, బాధల గాథలతో సాగిపోతుంది. కాని కవిత్వం అనేది- కళ కళ కోసంగా కాకుండా, ఎదుటి వ్యక్తికి ప్రతీకగా, ప్రజల పక్షాన నిలబడి ఆంబోతులకు గుదిబండగా ఉండాలని అంటాడు. అంటే కళ కళ కోసం కాదు- కళ ప్రజల కోసం ఉండాలంటాడు కాళోజి.
ప్రజలను హింసించు ప్రభువు మాకేల
వధియింప భక్షింప వన రాజులేడా.
నిజాం రాజరికంలో ప్రజలపై అణచివేత, దోపిడీ, హింసా ఖండనలు, మానభంగాలు ప్రతి రోజు కొనసాగుతుంటే నిజాం ప్రభువు తనకేమి సంబంధం లేనట్టు తన సంస్థానంలో హాయిగా రాణివాసంలో కులుకు తున్నాడు. ప్రజల యోగక్షేమాలకే పరిపాలనా విధానం ఉండాలి కాని భక్షించటానికి కాదని నిజాం రాజును ప్రశ్నించాడు.

తెలంగాణ పై కాళోజి అభిప్రాయం:
తెలంగాణ సాహిత్యంలో కాళోజికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ సాహిత్యం అనగానే మొదటి వరుసలో ఉండే వ్యక్తి కాళోజి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు ఆశపడి తెలంగాణనే ఊపిరిగా, తుది శ్వాస వరకు తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్న వ్యక్తి ప్రజాకవి కాళోజి. పెద్ద మనుష్యుల ఒప్పందం ప్రకారం కొన్ని షరతులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తో కలిసినది. పెద్దమనుష్యుల ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలు.
1. తెలంగాణ ప్రాంత విధాన సభ్యులు తెలంగాణ ప్రాంతీయ సంఘానికి సభ్యులుగా ఉండగలరు. ప్రాంతీయ సంఘం తెలంగాణ అభివృద్ధి నిమిత్తం విధానాలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవలెను. 2. తెలంగాణ మొత్తం ఆదాయంలో కొంత రాష్ర్టం పై వ్యయం కాగా, మిగులు నిధులు తెలంగాణ ప్రాంత అభివృద్ధి నిమిత్తం వ్యయం చేయవలె. 3. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియమాలకు తెలంగాణ ప్రాంతంలో 15 సంవత్సరాల నుండి నివసించే వ్యక్తులనే నియమించాలి. 4. తెలంగాణ ప్రాంతీయుని ముఖ్యమంత్రిగా లేదా ఉప ముఖ్యమంత్రిగా నియమించాలి.

- ఈ ఒప్పందం ప్రకారం పరిపాలన జరగలేదు. తెలంగాణలో అనేక మంది యువకులు, విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నకిలి ముల్కి ద్వారా ఆంధ్ర ప్రాంతపు వ్యక్తులే అనేక ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. తెలంగాణ ఎన్‌.జి.వొ. లకు ప్రమోషన్లు లేవు. అనేక సంవత్సరాలు గడిచినా సీనియార్టి లిస్టు తయారు కాలేదు. దీంతో పాటు తెలంగాణ భాష, యాస విషయంలో చిన్న చూపును చూసి కాళోజి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. అందుకే తన కలంతో అనేక తూటాలు పేల్చాడు. బూర్గునాటి ఒప్పందం, బట్టదాఖలైనప్పుడు/ విన్నపాలు విజ్ఞప్తులు, వినునాధులే లేనప్పుడు/ తెలంగాణ సిబ్బందిది త్రిశంకు గతి అయినప్పుడు - అంటూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయాడు. ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణకు రావలసినవి అడుగుతే అసలు వినే నాధుడే లేడు- అని ఇంతటి దుర్మార్గపు పరిస్థితి ఇంకోటి ఉండదంటూ కలతచెందాడు. తెలంగాణ బలము జాడ ఇల కడుపున మెదలుతాంది/ తెలంగాణ కృష్ణుడి వలె, మొలుస్తోంది జైలు లోన/ బ్రహ్మనందుడు కంసుడు, బలుస్తాండు జేలివతల- 1969 లో తెలంగాణ ఉద్యమం ఒక పెను తుఫానులా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం పురుటి నొప్పులు పడుతున్నదని, పాలించే రాషా్టన్న్రి ప్రశ్నించే యువకులు తయారయ్యారని ఇతిహా స పాత్రలతో కాళోజి- కౌరవులు ఎంత మంది ఉన్నా, ఎన్ని ఎత్తులు వేసినా చివరకు పాండ వులే నిలిచారని, తెలంగాణలో కూడా అంతే అంటూ- ఈ ప్రాంతాన్నేలే ముఖ్యమంత్రిని గద్దె దించడానికి తెలంగాణ ప్రజానీకం బలపడుతుందని తెలుపుతున్నాడు.

రెండున్నర జిల్లాలదె, దండి భాష అయినప్పుడు/ తక్కినోళ్ళ నోళ్ళ యాస, తొక్కి అణచబడ్డప్పుడు/ ప్రత్యేకంగా రాజ్యం పాలు, అడగ తప్పదన్నాడు. తెలంగాణకు భాష విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రజల భాష అందరికి సౌకర్యంగా ఆమోదయోగ్యంగా ఉండాలి కాని, కేవలం రెండున్నర జిల్లాల భాషనే ప్రామాణిక భాష అనడం ఎంత వరకు సమంజసం? నా తెలంగాణ భాషను, యాసను అణచివేయడం, కించపరచడం, తొక్కివేడం ఎందుకు? అని ప్రశ్నించి, మా భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని, మీతో మాకేంటి అని- ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఉండాల్సిన అవసరం అని చెప్పారు. అలాగే భాష విషయంలో తప్పొప్పులను చెబుతూ- చాయ్‌ అంటే తప్పా, టీ అంటే రైటా/ నాష్ట అంటే తప్పా, టిఫిన్‌ అంటే రైటా/ సడక్‌ అంటే తప్పా, రోడ్డంటే రైటా? సీమాంధ్ర వారు- మీరు ఎక్కువ ఉర్దూ పదాలు ఎక్కువ వాడతారు, మీ భాష సరికాదు - అన్నప్పుడు కాళోజి మీరు ఇంగ్లీష్‌ పదాలు ఎందుకు వాడుతున్నారు, మీదేమో రైటు, మాదేమో తప్పా అంటూ ప్రశ్నించాడు. అందుకే భాష విషయంలో బడి పలుకుల భాష మీదైతే పలుకుబడుల భాష మాదన్నాడు. ప్రాంతేతరుడే దోపిడీ చేస్తే/ దూరం దాక తన్ని తరుముతాం/ ప్రాంతీయుడే దోపిడీ చేస్తే/ ప్రాంతంలోనే పాతర వేస్తాం. - ఈ సమాజంలో దోపిడీ చేసే వాడు మనవాడు కావచ్చు, పక్క రాష్ట్రం వాడు కావచ్చు. ఎవడైనా ప్రజలకు అన్యాయం చేస్తే తరిమేయడమో, పాతరేయడమో తప్పదని సూటిగా చెప్పిన వ్యక్తి కాళోజి.                                        SURYA News paper 2014
===================================================================
http://www.koumudi.net/Monthly/2014/may/may_2014_vyAsakoumudi_kaloji.pdf
=========================================================================
కాళోజి


`ప్రభుత్వ టెర్రరిజాన్ని విమర్శించే మీరు పద్మ విభూషణ్ ఎందుకు పుచ్చుకున్నార`ని అడిగాను. కాళోజి అందుకు సంజాయిషీ కథ చెప్పారు. వరంగల్లులో వుంటున్న తనకు ప్రధాని పి.వి. నరసింహారావు నుండి ఫోను వచ్చిందట. ఇంట్లో ఫోను లేనందున, కలెక్టరేట్ కు ఫోను చేసి పిలిపించమన్నారట. డెఫ్యూటి కలెక్టర్ జీపులో వచ్చి కలెక్టర్ గారు పిలుస్తున్నారు రమ్మంటే, సరేనని జీపు ఎక్కి, అడిగారట. నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి తీసుకెడుతున్నారా అని. ఆయన నవ్వి. లేదండీ, ఢిల్లీ నుండి మీకు ఫోను వచ్చిందట, అందుకని అన్నారట. కలెక్టరేట్ లో సాదరంగా ఆయన్ను కూర్చోబెట్టి, ప్రధాని నరసింహారావుకు ఫోను కలిపారట. కాళన్నా, నీవు అన్నీ వద్దంటావు. కాని యీ సారి అలా అనొద్దు. పద్మ విభూషణ్ స్వీకరించడానికి ఒప్పుకో అంటే, కాళోజీ `సరే` అన్నారట.
పి.వి. నరసింహారావు, కాళోజీ చిరకాల మిత్రులు. ఒరే అనే టంత చనువు వున్న స్నేహితులు, దీని వెనుక వేరే కథ వుంది. స్టేజి, డ్రామాలలో ఆరితేరిన ఎ.ఆర్. కృష్ణకు పద్మభూషణ్ యివ్వమని సిఫారసు చేస్తూ, కాళోజీ రాసిన లేఖ అందుకున్న ప్రధాని పి.వి. నరసింహారావుకు ఆలశ్యంగా గంట కొట్టిందట- కాళోజీకి పద్మభూషణ్ యివ్వాలని. ఎ.ఆర్. కృష్ణకు పద్మశ్రీ యిచ్చారు. మొత్తం మీద శ్రీశ్రీ వలె కాళోజీ కూడా ప్రభుత్వ లాంఛనాలకు మెత్తబడ్డారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి, జైళ్ళ పాలైన కాళోజి, గేయాలు రాసి, ప్రజాకవిగా పేరొందారు. సాధారణ జీవితం గడుపుతూ గాంధేయుడి వలె నివశించారు.
కాళోజీతో పరిచయమైన తరువాత ఉభయులం కొన్ని సార్లు కలసి భోంచేశాం, ఔపోశనం పట్టాం. కాళోజీ నాన్ వెజి టేరియన్ తినేవాడు. ఇష్టం గా రం తాగేవాడు. తాపీగా భోజనం చేస్తూ బోలెడు కబుర్లు చెప్పేవాడు.
కాళోజి ఒక సారినాతో అన్నాడు. తప్పుడు ప్రదేశాల్లో గుచ్చినా సరే, అక్యు పంక్చర్ సూదులు, పనిచేస్తున్నాయట అని. నేను అశాస్త్రీయ చికిత్సలను విమర్శిస్తున్నట్లు తెలిసి, నన్ను సమర్థిస్తూ, వ్యంగ్యంగా అక్యుపంక్చర్ వైద్యులను దెప్పిపొడిచారు.
కాళోజి గేయాలు చదివాను. సింపుల్ గా సూటిగా వుంటాయి. నాగొడవ పేరిట రాసిన గేయాలు ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళాయి. ఉద్యమాలలో పాల్గొన్న కాళోజి, గాంధి, నెహ్రూ, రాజాజీ ఎం.ఎన్. రాయ్ ను మెచ్చుకునేవారు. రాయ్ ను యూనివర్శల్ పర్సన్ అనేవారు.  కాళోజీ, 1969 లో ప్రత్యేక తెలంగాణాను సమర్ధించి, అలాగే నిలిచిపోయారు.
నక్సలైట్ ఎన్ కౌంటర్ల విషయంలో స్పందించిన కాళోజీ, పౌర హక్కుల సంఘ సమావేశాలలో పాల్లొన్నారు. అప్పుడు తరచు కలిసే వాళ్ళం.
1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు కాళోజీ. డిపాజిట్ పోయింది. కాని ఆయనకు మహిళా సంఘాలు, అభ్యుదయ సంఘాలు మద్దత్తు యిచ్చాయి. ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతటా పర్యటించాల్సిన వెంగళరావు, తన నియోజక వర్గానికి అతుక్కుపోయి, పోటీ తీవ్రంగా తీసుకోవడం గమనార్హం. అప్పుడు ఆంధ్రజ్యోతి దిన పత్రిక బ్యూరో ఛీఫ్ గా, నేను సత్తుపల్లి వెళ్ళి, కాళోజీని కలసి, మెచ్చుకున్నాను.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కాళోజి జర్నలిస్టులతో కలిసి, మద్యం సేవిస్తూ కబుర్లు చెప్పేవారు. కొన్నాళ్ళు హైదరాబాద్ లోని హనుమాన్ టేకిడిలో నివసించారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా ఫెన్షన్ రావడంతో, ఆయనకు ఆర్థికంగా వెసులు బాటు లభించింది. బాగా వృద్ధాప్యం వచ్చే వరకూ, కాళోజి జీవించారు. ఆయనతో కాలక్షేపం ఎప్పుడూ ఆహ్లాదంగానే వుండేది.
రచనలు : నాగొడవ (గేయాలు), లంకా పునరుద్ధరణ (కథలు).
అనువాదాలు : ఖలీల్ జీబ్రాన్, దిప్రాఫెట్, రెబెల్ ఇండియా.




మహత్మ గాంధీ గారి ...సత్యశోధన లేక ఆత్మకథ


"కొల్లాయ గట్టితే నేమి? మా గాంధి కోమటైతేనేమి" అన్న భావకవి; "ఓ మహాత్మా ఓ మహర్షీ! ఏది సత్యం; ఏది అసత్యం ఏది నిత్యం ఏది అనిత్యం" అన్న మహాకవి: "ఇలాంటి మానవుడు ఈ భూమిమీద నడయాడాడంటే భావితరాలు నమ్మక పోవచ్చు" అన్న మరొక ప్రపంచ మేధావి పేర్కొన్న మహనీయుని 'సత్యశోధన' ఈ గాంధీ స్వీయచరిత్ర. సామాన్యులలో సామాన్యుడిగా సత్యం వీడని మహనీయుడిగా తన జీవితంలో సంశయాలు ఎదుర్కొన్నపుడు; తాను నమ్మిన సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు తాను ఎదుర్కొన్న బాధను నిస్సంకోచంగా చెప్పి కోట్లాది భారతీయులను ఏకత్రాటిపై నడిపి అహింస ద్వారా భారతీయ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి దాన్ని సాధించిన మహానీయుని ఆత్మకథ
నేను ఆత్మ చరిత్ర వ్రాయాలని అనుకోలేదు. అయితే అనేక సమయాల్లో ఎన్నో సత్య ప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్ని ఆత్మచరిత్రగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితం అట్టి ప్రయోగాలతో నిండివుంది. వాటన్నింటిని లిపిబద్ధం చేస్తే అది ఒక జీవన చరిత్ర అవుతుంది. అందలి ప్రతి పుట సత్యప్రయోగాలతో నిండి వుంటే నా యీ చరిత్ర నిర్దుష్టమైనదని భావించవచ్చు. నేను చేసిన సత్యప్రయోగాలు అన్నింటిని ప్రజల ముందుంచగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
నా ప్రయోగాలు ఆధ్యాత్మికాలు, అనగా నైతికాలు, ధర్మం అంటే నీతి. ఆత్మదృష్టితో పిన్నలు, పెద్దలు, యువకులు, వృద్ధులు నిర్ధారించగల విషయాలు ఈ కథలో ఉంటాయి. ఈ నా కథను తటస్థుడనై, అభిమానరహితుడనై వ్రాయగలిగితే సత్యాన్వేషణా మార్గాన పయనించి ప్రయోగాలు చేసేవారందరికీ కొంత సామాగ్రి లభిస్తుందని నా విశ్వాసం.
నా ప్రయోగాలు పూర్ణత్వం పొందాయని నేను సమర్థించుకోవడం లేదు. వైజ్ఞానికుడు బుద్ధి కుశలతతో యోచించి పరిశోధనలు చేస్తాడు. అయితే వాటి ఫలితాలే చివరివని భావించడు. వాటిమీద నమ్మకం ఏర్పడినా తాను మాత్రం తటస్థంగా ఉంటాడు. నా ప్రయోగాలు కూడా అటువంటివే. నేను ఆత్మనిరీక్షణ కూడా చేసుకున్నాను. ప్రతి విషయాన్ని పరీక్షించి చూచాను, విశ్లేషించి చూచాను. వాటి పరిణామాలే అందరికీ అంగీకారయోగ్యాలని, అవే సరియైునవని నేను ఎన్నడూ చెప్పదలచలేదు. అయితే ఇవి నా దృష్టిలో సరియైనవని, ఈనాటికి ఇవి చివరివని మాత్రం చెప్పగలను. అలా విశ్వసించకపోతే వీటి పునాది మీద ఏ విధమైన భవనం నిర్మించలేము. చూచిన వస్తువులను అడుగుగునా పరిశీలించి ఇవి త్యాజ్యాలు, ఇవి గ్రాహ్యాలు అని రెండు రకాలుగా విభజిస్తాను. గ్రాహ్యాలను బట్టి నా ఆచరణను మలుచుకుంటున్నాను. ఆ విధంగా మలుచుకున్న ఆచరణ ఎప్పటివరకు నాకు, నా బుద్ధికి, నా ఆత్మకు తృప్తి, సంతోషం కలిగిస్తూ వుంటుందో అంతవరకు దాని శుభపరిణామాలను విశ్వసిస్తూ ఉంటాను.
కేవలం సిద్ధాంతాలను అనగా తత్వాలను గురించి వర్ణనే ముఖ్యమని భావిస్తే ఈ ఆత్మకథ వ్రాయవసిన అవసరం లేదు. కాని ఆ ప్రయోగాలపై చేసిన కృషిని పేర్కొనాలి. అందువల్లనే నేను నా యీ కృషికి ప్రధమంగా సత్యశోధన అని పేరు పెట్టాను. ఇందు సత్యానికి భిన్నమని భావించబడే అహింస, బ్రహ్మచర్యం మొదలుగాగల వాటిని గురించిన ప్రయోగాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే నా అభిప్రాయం ప్రకారం సత్యమే అన్నింటిలోను గొప్పది. అందు పలు విషయాలు నిహితమై వుంటాయి. ఈ సత్యం స్థూలంగా వుండే వాక్సత్యం కాదు. ఇది వాక్కుకు సంబంధించినదేగాక భావానికి సంబంధించిన సత్యం కూడా. ఇది కల్పితసత్యం గాక సుస్థిరత కలిగిన స్వతంత్రమైన అస్థిత్వం గల సత్యం. అంటే సాక్షాత్‌ పరబ్రహ్మమన్నమాట.
 - మోహన దాసు కరంచంద్ గాంధీ

14, డిసెంబర్ 2012, శుక్రవారం

ప్రాభవం కోల్పోతున్న తెలుగు భాషకు జవసత్త్వాలు తిరిగి వచ్చేనా ? ---తూర్పింటి నరేశ్ కుమార్

తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాసిన నా ప్రత్యేక వ్యాసం

ప్రాభవం కోల్పోతున్న తెలుగు భాషకు జవసత్త్వాలు తిరిగి వచ్చేనా ?
                                               -----తూర్పింటి నరేశ్ కుమార్

"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా - గతమెంతో ఘనకీర్తి గలవాడా "
...అన్న వేములలపల్లి శ్రీకృష్ణ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. క్రీ.శ. 1 వశతాబ్దిలో ' నాగబు ' శబ్దంతో మొదలైన తెలుగు సాహితీ ప్రస్థానం నన్నయ, తిక్కన ల కాలంలో మొగ్గలు తొడిగి కృష్ణరాయల కాలంలో స్వర్ణయుగంగా పేరొందినది.
20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకుని 'సాహితీభారతి 'తనువు పులకరించిపోయింది.ఎంతో ఘన చరిత్ర కలిగినప్పటికినీ...ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే తెలుగు భాషా తేజం మసక బారుతున్నదా? అన్న సందేహం కలుగక మానదు. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం...మాతృభాషాపై తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల తెలుగు భాష క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోతున్నది.
మాతృభాషపై మమకారమేదీ....!!!!
"ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోనుండి
అమ్మ పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకు విందు
దేశభాషలందు తెలుగు లెస్స ".

అని మిరియాల రామకృష్ణ గారు పేర్కొన్నట్లుగా
: శిశువు తల్లి ఒడిలో పాలు తాగుతూ , తల్లి ముఖం నుండి నేర్చుకున్న భాషయే మాతృభాష. వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది మాతృభాషయే! భూమిపై జన్మించిన జీవరాసుల్లో బుద్ధి జీవియే మానవుడు .
భాషా సామర్ధ్యం మిగతా జీవులనుండి అతడిని వేరుచేస్తుంది.
భాష అంటే ఒక జాతి చరిత్ర .
భాష అంటే ఆ జాతి జీవనాడి .
శరీరం పనిచేయడానికి హృదయం ఎంత అవసరమో ఒక జాతికి భాష అటువంటిదే అని ఘంటాపథంగా చెప్పవచ్చును. భాషను వదులుకుంటే మన చేజేతులా మన చరిత్రను , సంస్కృతిని మనమే నాశనం చేసుకున్నట్లే. మనిషికి మనస్సు ,మేధ ముఖ్యమైనవి . విద్య మనోవికాసాన్ని , మేధో వికాసాన్ని కలిగిస్తుంది. మనోవికాసానికి సాహిత్య విద్య
మేధో వికాసానికి శాస్త్రీయ విద్య అవసరం.
ఈ రెండింటికీ భాష మూలం.
అన్నం పెట్టేది అవసరానికి ఆదుకునేది ఈ ప్రపంచంలో 'భాష అన్నది జగమెరిగిన సత్యం .
జాతిని , సంస్కృతిని , మానవ సంబంధాలను రూపొందించేది మాతృభాషనే అన్న భావాన్ని
మొక్కగా ఉన్నప్పుడే బాల బాలికల్లో మనం నిర్మించగలగాలి. ఆంగ్లేయుల నుండి స్వేచ్ఛ పొంది 60 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ , వారి మానస పుత్రిక అనబడే ' 'ఆంగ్లభాష ' బారినుండి మనం తప్పించుకోలేకపోతున్నాం.ఈ కాలంలో ఇంగ్లీషు పై వ్యామోహం తగ్గక అది క్రమేపి పెరుగుతూ వస్తుంది. మనది త్రిభాషా సూత్రం. మన విద్యార్థులకు ఏ భాషా సరిగా తలకెక్కదు. మన భాషపై మనకు పట్టు సరిగా ఉండదు. చివరకు నేటి విద్యార్థి జీవితం " రెంటికి చెడ్డ రేవడిలా " భవిష్యత్ అగమ్యగోచరమవుతుంది. మాతృభాష తెలుగు గల విద్యార్థి ఎల్.కె.జి స్థాయినుండి ఆంగ్లంలో విద్యనభ్యసించినపుడు సహజంగా అతను తన భాషా విలువలను , మూలాలను మరిచిపోవడం ఖాయం. 'పరభాషా మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌధం లాంటిదని' విశ్వకవి రవీంద్రుడు పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. ఉన్నత సామాజిక హోదాకలవారు , గొప్ప గొప్ప చదువులు చదివిన వారు తమకు తమకు తెలుగు బొత్తిగా రాదని చెప్పుకోవడం " స్టేటస్ సింబల్ "గా భావిస్తున్నారనే  విషయం మాత్రం అక్షరసత్యం .
పరభాషా వ్యామోహంలో తన స్వరూపాన్ని కోల్పోతున్న మాతృభాష!
"సంస్కృతం లోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసి పోయె తేట తెలుగునందు " .

అని ఓకవి చెప్పినట్లుగా ...ఇతర భాషలలోని విశిష్ట లక్షణాలను తనలో ప్రోది చేసుకొని
వేల సంవత్సరాలనుండి తరతరాలుగా తన అస్థిత్వంను నిల్పుకుంటున్న తెలుగు భాష
21 వ శతాబ్దంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
అంటే తెలుగు రాష్ట్రమని , తెలుగు దేశమని , తీయనైన తెలుగు
తేట తేటల తెలుగు , దేశభాషలందు తెలుగు లెస్స ...వంటి వాక్యాలు ఒకప్పుడు వాడుకలో ఉండేవని భావితరాలవారు చెప్పుకోవాల్సిన దుస్థితి ఇంక ఎంతో దూరంలో లేదు.
ఒక సర్వే ప్రకారం ...
"300 సంవత్సరాల తర్వాత తెలుగు భాష అనేది అసలే ఉండదనీ ,
ఆ కాలంలో మళ్ళీ పరిశోధనలు చేసి తెలుగు భాష ,లిపి ఇలా
డాక్టరేట్ పట్టాలు పొందే సౌలభ్యం కలదు.
పాలక వర్గాల విధాన నిర్ణయాలు , అలసత్వం , సరళీకరణ , ప్రభుత్వ ధోరణులు
కాన్వెంట్ నాగరికతకు బీజాలు వేసింది.వీటిల్లో అ , ఆ లకు బదులు ఎ , బి ,సి , డి లు నేర్పిస్తారు. ఇక్కడి ఇంగ్లీష్ మీడియం చదువులు మమ్మీ , డాడీ ల సంస్కృతి , ఆంటీ - అంకుల్ ల శకానికి పునాది రాళ్ళు లేస్తున్నాయని చెప్పవచ్చును. ఉదయమనగా ఇంటినుండి బయలుదేరిన 7 ఏళ్ళచిన్నారి సాయంత్ర సమయానికి మోయలేనిపుస్తకాల భారంతో , అలసిపోయిన ముఖంతో ఇంటికి వచ్చి 'మమ్మీ ' అని పిలుస్తాడు. మమ్మీ అనగానే తల్లులు తమ చిన్నారి ఇంగ్లీష్ లో పిలుస్తున్నాడని మహానందపడి చంకలు గుద్దేసుకుంటారు.
కాని మమ్మీలు అనగా ఈజిప్ట్ భాషలో ' శవాలు ' అని ఎంత మంది తల్లిదండ్రులకు తెలుసు?
ఈ మమ్మీడాడీల కల్చర్ మధ్య తరగతి నుండి దిగువ మధ్య తరగతికి శరవేగంగా వ్యాపిస్తోంది. .
కార్పోరేట్ కల్చర్ , పోష్ నడవడిక , ప్రతీ చిన్న విషయంలో పాశ్చాత్యీకరణకై అర్రులు చాచడం
పబ్ లో 'హగ్ ' లు ...డిస్కోథెక్ లలో 'బెల్లీ డ్యాన్సులు' .... పార్టీలలో 'పార్టీ ' లకై సెర్చింగ్ లు... హైటెక్కులు... డాలర్ కలలు ...వెరసి యువతకు తమ మాతృభాష అంటేనే అదో బ్రహ్మపదార్థంలా వింతగ చూసే పరిస్థితి నేడు నెలకొన్నది.
గరిమెళ్ళ సత్య నారాయణ గారు అన్నట్లుగా ...............................

"ఇంగ్లీషు లేకుంటె ఇహలోకము లోన
ఎవ్వడైనా బ్రతుకగలడా
గువ్వలా బువ్వ తినగలడా
ఆంగ్ల జవ్వనులతో షేకుహాండులు పొందగలడా!
అన్నది ఇక్కడ గమనార్హం ?!
నవతరం తల్లిదండ్రులు పిల్లలకు వారి యిష్టాయిష్టాలతో
ప్రమేయం లేకుండానే బలవంతగా పోటీ పరీక్షలు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు .
6వ తరగతి లోనే IIIT పౌండేషన్ చదువులు .... హావ్వ !ఇదేమి చోద్యం నక్కకు నాకలోకానికి
పొంతన కుదురుతుందా?
బలవంతమైన బరువు చదువులు విద్యా ర్థుల బాల్యాన్ని కుంగదీస్తున్నాయి .
పసి వయస్సులో ఫౌండేషన్ కోర్సులు కోర్సులు, పుస్తకాల మోతలు విద్యార్థికి
పెనుభారంగ పరిణమిస్తోంది.
చదువుల్లొ ఆటవిడుపులు లేక ,గమ్యాన్ని చేరు కోలేక ,మానసిక ఒత్తిడులు తట్టుకోలేని
కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నేడు నెలకొన్నది .
తెలుగు భాషాభివృద్ధికి సూచనలు :
1. ఆం.ప్ర. లోని ప్రతి షాపు పేరు ఖచ్చితంగా తెలుగులోనే ఉండాలి
2) కార్పొరేట్, ఇతర కళాశాలల్లో ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ద్వితీయ భాషగా తెలుగును భోధించాలి.
 3. డిగ్రీ కళాశాలల్లో కూడా తప్పనిసరిగా తెలుగును ద్వితీయగా నిర్భంధంగా అమలు చేయాలి.
డిగ్రీ స్థాయిలో తెలుగు ను కూడ మార్కుల శాతంలో కలపాలి. తెలుగు కు ప్రాక్టికల్సు కూడ నిర్వహించాలి.
4. తెలుగు పరిశోధక విద్యార్థులకు గౌరవ వేతనం ఇవ్వాలి.
5. తెలుగు మాధ్యమంలో పీ.జి. చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ ను కల్పించాలి.
6. అమ్మ, నాన్న,అత్తయ్య,మావయ్య,అన్నయ్య,అక్కయ్య అని పలకడం లో ఉండే మాధుర్యాన్ని
                                                                    నేటి తరానికి వివరించాలి .
7. ప్రాంతాలు వేరైనా,మతాలు వేరైనా ఇకమత్యంతో తెలుగు వాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం .
ముగింపు :
తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులెల్ల యెరుగనే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స..... 

  ముగింపు :
తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులెల్ల యెరుగనే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స.....
అన్న పలుకులు అను నిత్యం ప్రతి తెలుగు వాకిళ్ళలో పలకాలంటే తెలుగు వాడి వాక్కు విను వీధుల్లో విహరించాలంటే ప్రతి భాషాభిమాని తన వంతు ప్రయత్నంగా తెలుగు భాషాభివృద్ధికి ఉడతా భక్తిగా తన వంతు కృషి చేయాలి.


18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఆర్.జి.యు.కె.టి బాసర ....ఉపన్యాస పోటీల్లో విజేతలు:The Winners of RGUKT BASAR


ఆర్.జి.యు.కె.టి బాసర ....ఉపన్యాస పోటీల్లో విజేతలు ....ప్రథమ బహుమతి : బి.రేణుక B09 1334 ...Claas:W 6....ద్వితీయ బహుమతి : వెంకటరమణ .... Phi 8 ...ప్రోత్సాహక బహుమతి :చరిత్ర ....B091690..Phi 9---తూర్పింటి

ఉపన్యాస పోటీల్లో విజేతలు
ఆర్.జి.యు.కె.టి బాసర కేంద్రంగా జరిగిన
ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు పోటీపడి ఉపన్యసించారు.
వ్యక్తిగత విభాగాల్లో విజేతలు...
ప్రథమ బహుమతి : బి.రేణుక B09 1334 ...Claas:W 6
ద్వితీయ బహుమతి : వెంకటరమణ ..... Phi 8
ప్రోత్సాహక బహుమతి : చరిత్ర .....B091690 ...Phi 9
వీరికి  బహుమతుల ప్రదానం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (21/02/2011)సందర్భంగా ఆర్.జి.యు.కె.టి బాసర డైరెక్టర్ రాజేంద్రసాహు నుండి  బహుమతులు తీసుకోవడం జరిగిందని తెలుగుమెంటర్స్.....
తూర్పింటి.నరేశ్ కుమార్ , బి .బాలకృష్ణ,
డాక్టర్ గోపాలకృష్ణ , విజయ్ కుమార్ , 
సూరిబాబు , శ్రీనివాస్ , ప్రభావతి గార్లు తెలిపారు .
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (21/02/2011)సందర్భంగా ఆర్.జి.యు.కె.టి బాసర డైరెక్టర్ రాజేంద్రసాహు నుండి ఉపన్యాస పోటీల్లో బహుమతులు అందుకున్న విజేతలు...తెలుగు న్యాయనిర్ణేతలు( ప్రక్కన )

12, డిసెంబర్ 2010, ఆదివారం

"మాట్లాడే వెన్నెముక.....విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)"


మాట్లాడే వెన్నెముక.....విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)" మాట్లాడే వెన్నెముక-పాట పాడే సుషుమ్న;నిన్నటి నన్నయభట్టు-నేటి కవి సామ్రాట్టు;గోదావరి పలుకరింత-కృష్ణానది పులకరింత;కొండవీటి పొగమబ్బు-తెలుగువాళ్ళ గోల్డునిబ్బు "అని శ్రీశ్రీ ...విశ్వనాథగురించి అన్నారు ----తూర్పింటి నరేశ్ కుమార్

విశ్వనాథ సత్యనారాయణ (1895-1976)
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ....తన శిష్యుని గురించి ఇలా అన్నాడు.....
"నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్
సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్వ్త మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్ ".
శ్రీశ్రీ విశ్వనాథగురించి ఇలా అన్నాడు......
"మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద ".
తెలుగు సాహిత్యంలో ప్రాచీన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం వీరి రచనలు.
సాహిత్యంలో గౌరీశంకర శిఖరం తో వీరిని పోలుస్తారు.
అటువంటి వీరి జీవిత విశేషాలను తెలుసుకోవడం సాహితీ విద్యార్థి గా మనవిధి.
వారి జీవితాంశాలను ఓ సారి పరికిద్దాం....
విశ్వనాథ సత్యనారాయణ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి))
కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు.
తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. 
విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లిమరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులుబందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూల్ లోచెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం.
బి.ఎ. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బందరు హైస్కూల్ లోనే ఉపాధ్యాయునిగా చేరాడు.
ఉద్యోగం చేస్తూనే మద్రాసువిశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు.
తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు..
విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు.
ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు,
విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి.
ఆయన మాటలలోనే చెప్పాలంటే.......
"నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను
చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ...అని అన్నాడు .ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును.
విశ్వనాథ గురించి జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు -
"ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి.
వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు.
గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో
ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది.వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో,
భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది.
మహాకవి గా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం.
విన్నూత్న, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాధ పెట్టింది పేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్ని బట్టి
పాత్రల మనస్త్వత్తాన్ని విశ్లేషించుకుంటూ స్వయం వక్తిత్వంగల పాత్రలుగానూ, స్వయం ప్రకాశవంతమయిన
పాత్రలుగానూ, మహత్తరమయిన, రమణీయమయిన శిల్పాలుగాను తీర్చి దిద్దారు. అందునా వారి స్త్రీ పాత్ర చిత్రణ అద్భుతం!
ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచయితలను కొన్నైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే
ఆయన అంతర్జాతీయ ఖ్యాతినర్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు.
***అయితే విశ్వనాధ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యపడదు అన్నది జగమెరిగిన సత్యం .
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు.
ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నాడు.
* జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు, జ్ఞానపీఠపురస్కారాన్ని అందించినపుడు, సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది.********

********"As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare "range" Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene".**************************

*తమిళనాడులోని మధురై ప్రాంతం నేపధ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు
మళయాళంలోనికి,అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది.
ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు.
*వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించాడు.
*భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి.
*కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు.
*విశ్వనాధ నవలలలో పురాణవైర గ్రంధమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ
భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో ప్రతి నవలా ఉత్సుకతో నిండిన కధ,
అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.
విశ్వనాధ వ్యక్తిత్వం కూడా ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగింది.
తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవాడు. ఇందువల్ల విశ్వనాధను వ్యతిరేకించినవారు చాలామంది ఉన్నారు.
ఛాందసుడు అనీ, "గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్" అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించారు.
విశ్వనాధకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు. కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు.
షేక్స్‌పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించాడు.
గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాధకు తన ప్రతిభ గురించ అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు.
తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు
లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నాడు విశ్వనాధ.

"అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్ ".
జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాధ అనేవాడు.
శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనేవాడు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి
గూటికెలా చేరుతుందో అలాగే మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలనుకొనేవాడు.
విశ్వనాధ వ్యక్తిత్వాన్ని చతుర్వేదుల లక్ష్మీనరసింహం ఇలా ప్రశంసించాడు: -
"ఆహారపుష్టి గల మనిషి. ఉప్పూ కారం, ప్రత్యేకంగా పాలు ఎక్కువ ఇష్టం. కాఫీలో గాని తాంబూలంలోగాని ఎక్కువగా పంచదార వాడేవారు.
ఆజానుబాహువు. బ్రహ్మతేజస్సు ముఖాన, సరస్వతీ సంపద వాక్కున, హృదయ స్థానాన లక్ష్మీకటాక్ష చిహ్నంగా బంగారుతో మలచిన తులసీమాల.
మనస్సు నవ్య నవనీతం. వాక్కు దారుణాఖఁడల శస్త్రతుల్యం. చదివేవి ఎక్కువ ఆంగ్ల గ్రంధాలు. వ్రాసేవి ఆంధ్ర సంస్కృత గ్రంధాలు.
చిన్నలలో చిన్న, పెద్దలలో పెద్దగా వదిగి పోయే స్వభావం. శారీరికంగా వ్యాయామం, యోగాభ్యాసం అయన నిత్యం అభ్యసించేవి.
విమర్శలూ, స్తోత్రాలూ, తిట్లూ, దీవెనలూ, దారిద్ర్యం, ఐశ్వర్యం - ఇలాంటి ద్వంద్వాలకు అతీతుడు. ఒకమాటలో ఆయన
అపూర్వమైన 'దినుసు' అని ప్రశంసించాడు.
అవార్డులు - రివార్డులు :
*ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సామ్రాట్" బిరుదుతో సత్కరించింది.
* 1964లో ఆంధ్రా యూనివర్సిటీ "కళాప్రపూర్ణ" తో సన్మానించింది.
* 1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో "గజారోహణం" సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.
* శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
* "విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
* 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
* 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.
నవలా సాహిత్యం :
* వేయిపడగలు
* స్వర్గానికి నిచ్చెనలు
* చెలియలికట్ట
* ఏకవీర
* తెఱచిరాజు
* మాబాబు
* జేబుదొంగలు
* వీరవల్లడు
* వల్లభమంత్రి
* విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
* పులుల సత్యాగ్రహము
* దేవతల యుద్ధము
* పునర్జన్మ
* పరీక్ష
* నందిగ్రామరాజ్యం
* బాణావతి
* అంతరాత్మ
* గంగూలీ ప్రేమకధ
* ఆఱునదులు
* చందవోలు రాణి
* వేయి పడగలు
* శ్రీమద్రామాయణ కల్పవృక్షము
* కిన్నెరసాని పాటలు
* విశ్వనాధ మధ్యాక్కఱలు
* ప్రళయనాధుడు
* హాహాహూహూ
* మ్రోయు తుమ్మెద
* సముద్రపు దిబ్బ
* దమయంతీ స్వయంవరము
* నీల పెండ్లి
* శార్వరి నుండి శార్వరి దాక
* కుణాలుని శాపము
* ధర్మచక్రము
* కడిమిచెట్టు
* వీరపూజ
* స్నేహఫలము
* బద్దన్న సేనాని
* దిండు క్రింది పోకచెక్క
* చిట్లీచిట్లని గాజులు
* సౌదామిని
* లలితాపట్టణపు రాణి
* దంతపు దువ్వెన
* దూతమేఘము
* కవలలు
* యశోవతి

* పాతిపెట్టిన నాణెములు
* సంజీవకరణి
* మిహిరకులుడు
* భ్రమరవాసిని
* పురాణవైర గ్రంథమాల (పన్నెండు నవలలు)
o భగవంతునిమీది పగ
o నాస్తిక ధూమము
o ధూమమరేఖ
o నందో రాజా భవిష్యతి
o చంద్రగుప్తుని స్వప్నము
o అశ్వమేధము
o అమృతవల్లి
o పులిమ్రుగ్గు
o నాగసేనుడు
* హెలీనా
* వేదవతి
* నివేదిత
* నేపాళరాజ చరిత్ర (ఆరు నవలలు)
* కాశ్మీర రాజ చరిత్ర (ఆరు నవలలు

* శ్రీమద్రామాయణ కల్పవృక్షము
(6 కాండములు)
* ఆంధ్రప్రశస్తి
* ఆంధ్రపౌరుషము
* విశ్వనాథ మధ్యాక్కఱలు
* ఋతు సంహారము
* శ్రీకుమారాభ్యుదయము
* గిరికుమారుని ప్రేమగీతాలు
* గోపాలోదాహరణము
* గోపికాగీతలు
* భ్రమరగీతలు



* ఝాన్సీరాణి
* ప్రద్యుమ్నోదయము
* రురుచరిత్రము
* మాస్వామి
* వరలక్ష్మీ త్రిశతి
* దేవీ త్రిశతి (సంస్కృతం)
* విశ్వనాథ పంచశతి
* వేణీభంగము
* శశిదూతము
* శృంగారవీధి
* శ్రీకృష్ణ సంగీతము
* నా రాముడు
* శివార్పణము
* ధర్మపత్ని
* భ్రష్టయోగి (ఖండకావ్యము)
* కేదారగౌళ (ఖండకావ్యము)
* గోలోకవాసి
* దమయంతీస్వయంవరం
నాటకములు :
* అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)
* గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
* గుప్తపాశుపతము
* అంతా నాటకమే
* అనార్కలీ
* కావ్యవేద హరిశ్చంద్ర
* తల్లిలేని పిల్ల
* త్రిశూలము
* నర్తనశాల
* ప్రవాహం

* లోపల - బయట
* వేనరాజు
* అశోకవనము
* శివాజి - రోషనార
* ధన్యకైలాసము
* నాటికల సంపుటి (16 నాటికలు)

విమర్శలు :
* అల్లసానివారి అల్లిక జిగిబిగి
* ఒకనాడు నాచన సోమన్న
* కావ్య పరీమళము
* కావ్యానందము

* నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి
* విశ్వనాధ సాహిత్యోపన్యాసములు
* శాకుంతలము యొక్క అభిజ్ఞానత
* సాహిత్య సురభి
* నీతిగీత
* సీతాయాశ్చరితమ్ మహత్
* కల్పవృక్ష రహస్యములు
* సాహితీ మీమాంస.
@@@@@@ ఇతరములు @@@@@@
* కిన్నెరసాని పాటలు
* కోకిలమ్మ పెండ్లి
* పాము పాట
* చిన్న కథలు
* ఆత్మ కథ
* విశ్వనాధ శారద (3 భాగాలు

* యతిగీతము
* What is Ramayana to me.

ఆంధ్ర పౌరుషము నుండి ఈపద్యం ను చదవండి

గోదావరీ పావనోదార వాపూర మఖిలభారతము మాదన్న నాడు
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెల్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయునాడు
అక్షరజ్ఞానమెరుగదో యాంధ్రజాతి
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుకగూండ్లు గట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు
రామాయణ కల్పవృక్షం నుండి.......
ఆకృతి రామచంద్ర విరహాకృతి
కన్బొమ తీరు రామ చాపాకృతి
కన్నులన్ ప్రభు క్రుపాకృతి
కైశిక మందు రామదేహాకృతి
సర్వ దేహమున యందు రాఘవ వంశ మౌళి ధర్మాకృతి
కూరుచున్న విధమంతయు రామచంద్ర ప్రతిజ్ఞ మూర్తియై.

విశ్వేశ్వర శతకము నుండి

మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!

కిన్నెరసాని పాటల నుండి

నడవగా నడవగా నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిలా తోచింది
కడు సిగ్గు పడు రాచకన్నెలా తోచింది
బెడగు పోయిన రత్నపేటిలా తోచింది.

కోకిలమ్మ పేళ్ళి నుండి......
చిలుక తల్లి మహాన్వయంబున
నిలిచినవి సాంస్కృతిక వాక్కులు
కోకిలమ్మా తెలుగు పలుకూ
కూడబెట్టినదీ

మరొకటి......
వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
అంగనామణి పెండిలియాడి కూడ
ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె..................?????