మన మువ్వన్నెల పతాకం

India is best - MOBANGO - Free
mobile applications, games, themes, ringtones, wallpapers and videos
for your mobile phone

13, మార్చి 2010, శనివారం

నృసింహావతారము పరిచయం: వివరణ

నృసింహావతారము పరిచయం: వివరణ
శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణకై మరియు లోక కళ్యాణార్థమై
దశావతారములు ఎత్తాడు.

వాటిలో నృసింహావతారము నాల్గవది.
సంస్కృత సాహిత్యంలో అవతార గాథ కథాథ్మకంగా స్తోత్ర రత్నంగా వుంది.

తెలుగులో ఎఱ్ఱాప్రగడ మొదలైన వారు కావ్యాలు వ్రాశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 40 వరకు నృసింహా లయాలు వున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి 22 అచ్చంపేట మండలంలో ....

కల్వకుర్తి మండలంలో .....వనపర్తి మండలంలో.....
నాగర్ కర్నూల్ మండలంలో
అధికంగా ...కొల్లాపూర్ ...మక్తల్.... అలంపూర్
జడ్చర్ల మండలాల్లో ...ఒక్కోక్క నృసింహా లయాలు వున్నాయి

మహబూబ్ నగర్ మండలం కోయిలకొండలోని
నృసింహ స్వామి ఉగ్రావతారుడు.వనపర్తి మండలంలోని అంకూర్లో ,కొల్లపూర్ మండలంలోని

సింగపట్నంలో, మక్తల్ మండలంలోని ,మంగనూర్లో లక్ష్మినృసింహా ఆలయాలు వున్నాయి.
సింగపట్ట్టణం(సింగోటం) లక్ష్మినృసింహా స్వామి జాతర :
పరిచయం కొల్లపూర్ మండల కేంద్రానికి 9 కి .మీ. దూరంలో
సింగోటం(సింగపట్ట్టణం) గ్రామంలో శ్రీలక్ష్మినృసింహాస్వామి
లింగరూపంలో వెలియడాన్ని విశేషంగా చెపుతారు.
శివకేశవులకు ఆభేదం లేకుండా స్వామివారు ...

త్రిపూండ్రాలు ...ఊర్ధ్వపూండ్రాలు
కలిగి స్వయంభూఃగా ఈ ప్రాంతంలో వెలిశారు.
తదనంతర కాలంలో స్వామి ఆలయ పాదానికి కుడివైపున శివాలయ ప్రతిష్ట,
రత్నగిరికొండపై రత్నలక్ష్మీ
అమ్మవారి ప్రతిష్టను చేశారు .

శ్రీలక్ష్మినృసింహాస్వామి గోవిందా....గోవిందా..... అంటూ మిన్ను ముట్టే భక్తుల గొంతుకలతొ
సిగమెత్తే శివసత్తుల కోలాహాలంతో వేలాది భక్తుల భక్తి,పారవశ్యంతో కోలాటంవేసే భక్త మండలి ఉత్సహనందాలతో మకర సంక్రాంతి మొదలుకొని .....నెలరోజుల పాటు
ఉత్సవాలు చూపరులకు నయనాందాన్నికలుగజేస్తాయి . ప్రతీ సంవత్సరము జరిగే ఈ

జాతరకు మహబూబ్ నగర్ జిల్లాయే గాక ఇరుగు పొరుగు జిల్లావాసులతో పాటు
కర్ణాటక ,రాజస్థాన్
రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకోని తరిస్తారు.

దేవాలయ స్థల ఐతిహ్యం
జిల్లాలోని ప్రాచినమైన ప్రసిద్దినోందిన దేవాలయల్లొ

సింగపట్ట్టణం(సింగోటం) లక్ష్మినృసింహా స్వామి దేవాలయం ఒక్కటి రత్నగిరి కొండకు ఆభిముఖంగా స్వామివారు ఈ ప్రాంతంలో కొలువుదీరటానికి ముందు ఆసక్తికరమైన 600 సంవత్సరాల చారిత్రక గాథఒకటి వుంది
సురభి వంశానికి చెందిన 11వ తరంవాడైన సింగమనాయుడు 
అను భూపాలుడు జటప్రోలు ప్రాంతాన్ని కేంద్రంగా పరిపాలిస్తున్న రోజులవి.
ఆ జిల్లాలో సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక యాదవుడు 
ప్రతిదినం తెల్లవారు ఝామున గోర్కోలు చూసూకుంటూ తన పొలము లో అరక దున్నుతుంటాడు.
అపుడు లింగరూపంలో ఉన్న ఒక నల్లని సరుపరాయి నాగలికి అడ్డు తగలుతూ అతని పనికి అంతరాయం కలిగించేదట. రైతు ఆ శిలను ఎన్ని సార్లు ప్రక్కకు చేర్చినా అదే స్థలానికి చేరుతుండటంతో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు.ఆ శిల మహిమను ఆతడు గుర్తించలేకపోయాడు. ఆవిధంగా కోన్ని రోజులు గడిచాయి.........

ఆ యాదవుడు తాను పేదవాడినని, తన పనికి అంతరాయం కలుగకుండా కరుణించమని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్ధించాడు. భక్థుని మొర నిన్న శిలారూపంలోని స్వామి ఆ రాత్రి నేరుగా భూపాలుడైన ' సింగమనాయునికి ' స్వప్నరూపంలో సాక్షాత్కరిస్తాడు. ' 
తాను ఉత్తర దిశలో రెండు ఆమడల దూరంలో గల 
ఒక రైతు పొలంలో లింగరూపంలో వెలిశానని, రోజూ నాగలికి అడ్డుపడుతూ ఉన్నా రైతు తనను గుర్తించడం లేదని, ఇదే దినం తనను గుర్తించి వెంటనే ప్రతిష్ఠించి పూజలు జరుపమని " శాసించడంతో సింగమనాయుడు నిద్రనుండి ఉలిక్కిపడి లేచి తాను కలలో విన్నది, కన్నది ఇంతవరకు నిజమౌ! అనుకొని సైన్యంతో లింగ రూపంలో వున్న 
ఒక శిల కాంతివంతంగా వెలుగుతూ కనిపించింది. 
కలలో స్వామిని, ప్రజలు తోడురాగా ప్రస్తుతం వున్న ఆలయం వెనక
ఎత్తైన బండ ప్రాంతానికి రాగానే స్వామి శిలను తల పై ఎత్తుకున్న వానికి ఆవహిస్తాడు. 
తాను లక్ష్మి నృసింహున్నని చెప్పుకుంటాడు. ప్రప్రధమంగా స్వామి ప్రతిమను ఇక్కడే దించారు 
కనుక దీనికి " పాదం గుడి" అని పేరు.
సింగమ భూపాలుడు బ్రాహ్మణులైన ఓరుగంటి వంశీయుల సహకారంతో స్వామిని గంగాజలంతో అభిషేకించి  ప్రతిష్ఠించారనేది ఈ స్థల ఐతిహ్యం. అప్పట్లో స్వామి వారికి ఎండ తగలకుండా ఉండాటనికి నాపరాయితో నిర్మించిన అతి సామాన్యమైన చిన్న గుడి గర్భగుడిలో నేటికీ కనిపిస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తొది. స్వామివారువారు వెలసిన నాటి నుండినేటికి నిర్విఘ్నంగానిత్యం పూజాభిషేకాలు జరుగుతున్నాయి..

సింగపట్ట్టణం క్షేత్ర ప్రసక్తి మదన గోపాల మహాత్మ్యము అను స్థల పూరాణంలో వుంది దాని ప్రకారం పూర్వం ఇది అరణ్య ప్రాంతం. కాశి నుండి సింగవటువు అనే బ్రహ్మచారి ఈ మగతలో అతనికి "' నీవు అహోబిలం వరకు రానక్కరలేదు. ఇక్కడనే ఉండి తపస్సు చేయి అనే ఆదేశం వినిపించింది. అది విన్న అతడు అక్కడనే ఒక పురాతన ఒక పురాతన వటవృక్షాన్ని ఆశ్రయించి తపస్సు కొనసాగించాడు. కొన్ని దినాలకు స్వామికి అతని పై అనుగ్రహం అభిషేకించి కలిగి ,, పొదలి కొండపై ఒక పాదం మోపి, అక్కడి రాతిగుట్ట పై రెందో పాదం మోపీ అతనికి దర్శనమిస్తాడు. 
ఇక్కడి నృసింహా మూర్తిని లింగాకారంలో పూజిస్తున్నారు. వికారాబాద్ సమీపంలో అనంతగిరిలో నృసింహస్వామి ఈ విధంగానే ఉంటాడు.

3.4.3 స్వామి ఆకృతి :
నృసింహ స్వామి ప్రతిష్ఠ జరిపిన కాలంలోనే ఆంజనేయ ప్రతిష్ఠ జరిగింది. ఈ క్షేత్రంలో వెలసిన స్వామి లింగాకారంలో నృసింహ స్వామి. స్వామికి ఒక కన్ను క్రిందకు, ఒక కన్ను మీదకు వుంటుంది. ఎదమకన్ను క్రింద గల భాగంలో కమలం వుంది. కమలం లక్ష్మీ స్థానం కనుక స్వామి లక్ష్మీ నృసింహుడు అయ్యడు. స్వామి వెలసిన రాతికొండకు 'శ్వేతాద్రి అని పేరు.

3.4.4 రత్నలక్ష్మి అమ్మవారు : 
శ్రీలక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి అభిముఖంగా అర కిలోమిటరు దూరంలో రత్నగిరి అనే పేరుగల ఎతైన కొండ వుంది. ఆ కొండ పై రత్నలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. 
స్వామి హృదయం పై గల కమలం లక్ష్మీ స్థానం కనుక లక్ష్మీదేవి అమ్మవారు 
భక్తులకు కనిపించడం లేదు. అందువల్ల రాణి రత్నమాంబ హయాంలో 
148 సంవత్సరాల క్రితం మద్రాసు నుండి క్రీ.శ. 1857 లో రత్నలక్ష్మీదేవి 
విగ్రహాన్ని తీసికొని వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ కొండ పై ఆహ్లాదకరమైన 
వాతావరణంలో కొల్లాపూర్ రాజావారి పురాతనమైన విడిది భవనం వుంది. 
చుట్టుప్రక్కల గ్రామాల వాటికి విద్యార్ధులకు ఈ రత్నగిరి కొండ 'పిక్నిక్ స్పాట్ 'గా ఉపయోగపడుతోంది.

3.4.5 హరిహరాద్వైతం - వివాదం :

"లింగాకారం త్రిపుండ్రాంకాం -కేవలం జ్ఞానమూర్తినాం

ద్వంద్వాతీతం మహోపాశ్వం -అబేధంశివకేశవమ్ "

భావం : లింగారంలోనూ త్రిపూండ్రాలను , జ్నానమూర్తిత్త్వంలోనూ, ద్వందాతీతులైన శివ, కేశవులు అభేద స్వరూపులు. ఈ శ్లోకంలో శివ, కేశవుల అభేదం ప్రతి పాదించారు.
నృసింహాస్వామిని సింగపట్టణం క్షేత్రంలో లింగాకారంలో పూజిస్తూన్నరు. స్వామికి  త్రిపూండ్రం ఊర్ధ్వపుండ్రాలు ఉన్నాయి .కనుక ఇది హరిహరాద్వైత్వం. ఇచట పూజాదికాలు నిర్వర్తించేది స్మార్తులైన ఓరుగంటి వంశీయులు. శైవ, వైష్ణవ పట్టింపులు అధికంగా ఉన్న కాలంలో శైవులకు, వైష్ణవులకు అర్చకత్వం విషయంలో వివాదం ఏర్పదింది. అపుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబగారు పుష్పగిరి చూస్తే, స్వామి వారికి అడ్డనామాలతో పాటు నిలువు నామాలు కనిపించాయి. అందువల్ల ఈ స్వామిని దర్శించిన వైష్ణవులకు వైష్ణవుడైన ' ఎంబళ పెరుమాండ్లు ' దర్శించాలనే నియమం ఏర్పాటు చేశారు.
ఆ సమయంలోనే ఆలయపాదానికి కుడివైపున పుష్కరిణి ప్రక్కన శివాలయాన్ని కూడా నిర్మింపజేశారు. ఈ ప్రాంతపు స్మార్తులు శివ, కేశవ భేదం లేకుండా పూజాదికాలు నిర్వర్తిస్తారు. అందువలన వారికే అర్చన బాద్యతలు అప్పగించారు. ఇక్కడ స్వామి వారు హరిహరాద్వైతం అయినప్పటికీ సామాన్య ప్రజానికం వైష్ణవ రూపంలోనే గోవిందా..గోవిందా...అంటూ స్వామివారిని కొలవడం విశేషం.

3.4.6 పుష్కరిణి :
నృసింహాస్వామి ఆలయ పాదానికి కుడివైపున గల పవితర గుండంలో భక్తిశ్రద్ధలతో స్నానమాచరించినంతనే సర్వరోగాలు హరించిపోతాయని, మనసారా స్వామిని ద్యానించి తలనీలాలు సమర్పించుకొని ఈ గుండంలో స్నానాలు చేస్తే సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ తడిబట్టలతోనే మ్రొక్కులు చెల్లించుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం.

తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఈ ప్రాంతంలోని జలాశయాలు ఎండిపోయినా ఈ పరిత్రగుండన్లో మాత్రం సర్వకాల సర్వావస్థల్లో నీరు ఉండటం ప్రత్యేకత. భక్తులు మొక్కుగా బెల్లంగడ్డలు పుశ్క్రిన్దిలో వేస్తే తమ రోగాలు స్వామి హరింపజేస్తాడనేది ఈ ప్రాంత జానపదుల విశ్వాసిం.

3.4.7 దేవాలయాభివృద్ధి : మొదట నాపరాయితో అతి సామాన్యంగానిర్మించిన ఈ దేవాలయం తర్వాతి కాలంలో అభివృద్ధికి నోచుకుంది. నిజాం కాలంలో మంత్రి అయిన చందూలాల్ బహద్దూర్ గారు ఈ దేవలయాన్ని దర్శించి దీని అభివృద్ధి నిమిత్తం 240 ఎకరాల మెట్ట,12 ఎకరాల మాగాణిని అర్చకులైన  లక్ష్మీ నరసింహయ్య శాస్త్రిగారి హయాంలో అర్చకత్వానికి రాసి ఇచ్చారు. దీన్ని 'దేవునిమాన్యం ' గావ్యవహరిస్తారు. స్వామి ప్రాచినుడైనప్పటికీ ఆలయ నిర్మాణం మాత్రం చాలాకాలం తర్వాత అనగా సన్ 1215 అనగా క్రీ.శ. 1795లో నిర్మించారు. 
గర్భగుడి 40 అంకణాల మంటపం  అర్చకుడైన రాఘవ సోమయాజి కాలంలో నిర్మించారు. ఇక్కడ గల సత్రశాలను కర్నూలు నివాసి కటకం బొర్రయ్య శెట్టి కుమారుడు బారయ్య సెట్టి శాలివాహన శకం 1819 హేవిలంబి మార్గశుద్ధ భానువారం(క్రీ.శ. 1897)లో నిర్మించాడు.
  *కొల్లాపూర్ రాణి వెంకట రత్నమాంబ గారు స్వామి గాలిగోపురం కట్టించింది.
*క్రీ.శ. 1854లో స్వామికి ఎదురుగా గల గుట్టకు రత్నగిరి అనే పేరు పేట్టి, రత్నలక్ష్మీ దేవాలయాన్ని, పద్మనిలయంఅనే విలాస భవనాన్ని  రత్నమాంబ గారు కట్టించి, తోట వేయించింది.
శాలివాహన శకం 1881 లో భక్తులు తేరును చేయించగా దినికి ఎదిరె నర్సింగరావు గారు రథశాలను కట్టించినారు.
*శాలివాహన 1886లో సురభి వెంకట జగన్నాథరావు గారు ఆలయ పాదానికి కుడివైపున గలగుండానికి
స్నానాలమెట్లు కట్టించినారు.

*1890 శ్రీమతి ఇందిరాదేవి గారి స్మారకంగా, నృసింగసాగరానికి కాలువను సురభి వంశస్థులు నిర్మించారు.

3.4.8 బ్రహ్మోత్సవాలు - జాతర : '
మకరే రవి :' అన్నట్లుగా మేషరాశి లోకి సూర్యుడు ప్రవేశించినపుడు 

ఉత్తరాయన పుణ్యకాలం వస్తుంది. ఆ సందర్భంలో సంక్రాంతి మొదలుకొని
దాదాపు నెరోజుల పాటు ఈ ప్రాంతంలో జాతర జరుగుతుంది.
జనవరి 14 వ తేదిన స్వామివారికి పూజా కైంకర్యం ,మద్యాహ్నాం మొదలుకొని 
సాయంత్రం వరకు శకటోత్సవం జరుగుతుంది. ఈ రోజున శకటోత్సవం 
విశేషంగా జరుగుతుంది. 
ఫలారం బండ్ల రోజున సింగపట్టణం చుట్టుపక్కల గ్రామాల వారు ఎద్దులను బండ్లను
అలంకరించి స్వామికి ఎదురుగా గల జమ్మిచెట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్వామి వారిని దర్శించుకోవడంతో ఉత్సవం ముగుస్తుంది.
* 15వ తేదీన స్వామి వారికి కళ్యాణోత్సవం, రధం పై మోహినీసేవ గజవాహన సేవ వుంటాయి.
*16 వ తేదీన సింహవానంతో రధం పై ప్రభోత్సవం జరుగుతుంది.
* 17వ తేదీన రధోత్సవం జరుగుతుంది. సాయంత్రం 4 -30 నిమిషాలకు దాదాపు లక్షమంది స్వామివారికి తెప్పోత్సవంను రాత్రి 8 -00 గంటల నుండి ఉ 10 -00 గంటల వరకు నిర్వహించారు.
* 19 వ తేదీన శేషవాహన సేవ, తీర్ధావళి తదనంతరం పానుపు సేవలు జరుగుతాయి.
* గత 3 సంవత్సరాల నుండి ఫొండర్ ట్రస్టీ ఆధ్వర్యంలో లక్ష్మీ నృసింహస్వామి యాగాన్ని 
లోక కళ్యాణార్ధం నిర్వహిస్తున్నరు.

3.4.9 సాహితీ సంపద :

స్వామి అవతారం నృసింహుడైనప్పటికీ  కోరిన కోర్కెలను నెరవేర్చే దైవంగా ఈ స్వామి ఖ్యతినొందారు. ఈ ప్రాంత స్వామి పై అక్షరలక్షలు విలువ చేసే సాహితీ సృష్టి జరిగింది. 

సురభి వంశంలో 26 వతరం రాజైన శ్రీవేంకట జగన్నాధరావు కాలంలో కవి సార్వభౌబిరుదాంకితుడైన  హోసదుర్గం కృష్ణమాచార్యూలు సింగపట్నం నృసింహస్వామికి
అంకితంగా"లక్ష్మీ నృసింహవిలాసం" అను సంస్కృత చంపువును రచించాడు.

"సింగపట్న నృసింహ శతకం" ను, సింగపట్టణ నరసింహ విలాసం"
"సింగపట్టణ నృసింహ క్షేత్ర మహాత్మ్యం" కావ్యాలను రచించారు.
సింగపట్టణ నృసింహశతకం మకుటం ' సింగవట నరసింహ ' సింగపట్టణం నివాసియైన శ్రీవత్సస గోత్రీకులైన ఓరుగంటి లక్ష్మీ నారాయణగారు " సింగపట్నం లక్ష్మీ నృసింహస్వామి చరితం" అను వచన్కృతిని రచించారు.
ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ--------- ' నవరత్నస్తోత్రమాల ' ను రచించారు. 

3.4.10 ప్రత్యేకతలు - ముగింపు :
* ఈక్షేత్రంలో స్వామి నృసింహుడు అయినప్పటికీ లింగరూపంలో వుంటాడు. 
స్వామికి త్రిపుండ్రాలు, ఊర్ధ్వ పుండ్రాలు వుండటం వలన స్వామి హరిహరాద్వైతంనకు 
ప్రతిరూపంగా నిలుస్తాడు.
*స్వయం భూ : అయిన స్వామికి అచకులుగా స్మార్తులైన శ్రీవత్స గోత్రీకులు, 
ఓరుగంటి వంశీయులు ఇప్పటికి కొనసాగుతూనే వున్నారు
* నృసింహస్వామికి అభిముఖంగా 1 కి.మీ. దూరంలో గిరిపై రత్న లక్ష్మీ అమ్మవారు వెలిశారు.
*సంకటాలు వున్న వారు ఈ ఆలయంలో గండదీపం మోసి తమ మ్రొక్కులను చెల్లించుకుంటారు. ఈ స్వామికి మ్రొక్కు క్రింది  గుమ్మడికాయలు సమర్పించుకుంటారు. 
గొల్లదాసరులు ఈ స్వామి సేవలో తరిస్తారు.
* భక్తులు పవిత్ర గుండలో బెల్లం గడ్డలు వేసి తమ బరువులను తొలగించుకుంటారు.
*స్వామి ఆలయ పాదానికి ఎడమవైపున నృసింహసాగరం ప్రతీ 7 సంవత్సరాలకు 
ఒకసారి మాత్రమే పూర్తిగానిండి అలుగు పారుతుంది.
* భక్తులకు స్వామి ఆవాహనయి భూత ,భవిష్యత్ కాలాలను గురించి చెప్తాడు.
*స్వయం భూ అయిన ఈ స్వామి ఏకాదికేడాది క్రమక్రమంగా పెరుగుతున్నాడని భక్తులూ విశ్వసిస్తున్నారు.

స్వామి ఆవిర్భవించిన సందర్భంలో...
స్వామి ----- నృసింహూడు, భూపాలుడు ---- సింగమనాయుడు
గ్రామం ---- సింగపట్ట్ణం, తొలి అర్చకుడు ---- నరసింహయ్య శాస్థ్రి

కాకతాళీయంగా ఒకటే కావడం వెశేషంగా చెప్పుకోవచ్చు.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నొ వింతలకు, వెశేషాలకు, విశ్వాసాలకు నిలయం ఈ సింగపట్ట్ణణం. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జాతర ఈ ప్రాంత జనుల సంస్క్రతికి దర్పణం పడుతుంది. కుల, మత వర్గాలకు అతీతంగా జానపదులను ఒకేత్రాటి పై నడుపుతోంది. వర్తమాన పరిస్థితుల ప్రభావాన్ని తన దరికి చేరనివ్వకుండా భక్తుల పాలిట కోరిన కోర్కెల కొంగు బంగారమై ఆదర్శంగా నిలుస్తోంది.
[ఆధారం :"కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు ఒక పరిశీలన "
తూర్పింటి నరేశ్ కుమార్
]

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

తెలుగు నెట్ పేపర్ 2008 :NET 2008 JUNE

2008 జూన్ మోడల్ పేపర్ :2
ఈ విభాగంలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి . ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
1.తాలవ్యీకరణానికి ఉదాహరణ
చిలుక...ఎలుక......కిళి.....కిటి....
2.కలిమి అనగా
తద్దితం...క్త్వార్థం...కృదంతం...శత్రర్థకం
3.వర్ణవ్యత్యయం జరిగిన పదం :
బత్తి...అరదం...వంకాయ....నవ్వుటాల.
4.అతడు కళాశాలకు వెళ్ళి తిరిగి వచ్చాడు...ఇది ఏ వాక్యం.....
సామాన్య...సంశ్లిష్ట...సంయుక్త...క్రియారహిత
5.దంత మూళీయం :
ర...ట.....త......హ......
6.మనుచరిత్ర కథ తీసుకోబడిన గ్రంధం :
గరుడ....మార్కండేయ....సూత.....వరాహ....
7.హరికథ పితామహుడు
నారయణ దాసు,,,రామదాసు,,,,నాజర్...బెనర్జి
8.పారిజాతాపహరణంలో సత్యభామ చేసిన వ్రతం
గౌరీవ్రతం...పుణ్యక....పారిజాత....పుష్పక....
9.శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోని కథ
తిన్నడి కథ...సిరియాళుడు...నిగమశర్మ...బెజ్జమహాదేవి....
10.మన్నారుదాసు విలాస యక్షగాన కర్త
మధుర వాణి...ముద్దుపళని.....రంగాజమ్మ....రామభద్రాంబ
11.సైనికుడి ఉత్తరం ఎవరిది ?
రాయప్రోలు.....కుందుర్తి.....తిలక్....శ్రీశ్రీ...
సూతపురాణం ఏ వాదానికి చెందినది?
స్త్రీవాదం.....హేతువాదం.....మైనారిటీ...వైయక్తిక....
13.గబ్బిలానికి కావ్యగౌరవం కలిగించినడి.
విశ్వనాథ....వేదుల.....జాషువా....నండూరి .

ఇది నా సిద్దాంత గ్రంధం :



"కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు -ఒక పరిశీలన "

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

మూసీలో ప్రచురితమైన నా వ్యాసం


మూసీ లో ప్రచురితమైన నా వ్యాసం


నన్నయ:ఆంధ్రమహాభారతానువాదం



నన్నయ
-
తూర్పింటి నరేశ్ కుమార్
తెలుగు సాహిత్యంను
చదువుకుంటున్న
ప్రతి విద్యార్థి తెలుసుకోదగ్గ పేరు నన్నయ!!!!! ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.... ..... 21వ శతాబ్దంలో నేడు మనం చదువుకుంటున్న సాహిత్యానికి మూలవిరాట్టు.. .....సాహిత్యానికి పెద్దన్నయ్య .....ఈ నన్నయ!!!!! తెలుగు సాహిత్యానికి ఓ దిశా నిర్దేశాన్ని చేసిసాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఘణనీయుడు.... అంతవరకు సాహిత్యానికి రూపురేఖలు లేని కాలంలో.... సరస్వతికి అలంకరణలు చేసిన గొప్పసాహితీవేత్త. అస్తవ్యస్తంగా పడిన తెలుగు భాషామ తల్లి బీజాక్షరాలను
ఓ చోటికి చేర్చిన ఆదికవీంద్రుడు....
శబ్దశాసనుడు ....
ఈయన కాలం 11 వ శతాబ్దం.తూర్పు చాళుక్య వంశానికి రాజైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి.
నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, అరణ్యపర్వాన్ని సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే. ఆంధ్రభాషకు కావ్యము, వ్యాకరరణము రెండింటిని ప్రసాదించాడు నన్నయ్య భట్టు. నన్నయ్య గారు రాజమహేంద్రవరం లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు.అందుకు సరియైన వ్యక్తి నన్నయభట్టు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు . ఆపస్తంబ సూత్రుడు, ముద్గల గోత్రుడు, పురాణ విజ్ఞానం, లోక జ్ఞానం, సంస్కృతాంధ్రములలో కవిత్వం చెప్పగల మహా ప్రతిభాశాలి.
రాజ రాజ నరేంద్రుడు నన్నయభట్టారకున్ని నిండుసభలో పిలిపించి తమ పూర్వీకుల చరిత్ర ఐన [చంద్ర వంశ ప్రభువుల ] పాండునందనల చరిత్రలను వినాలని తన మనోగతాన్ని వినిపించాడు.దానికి ఒప్పుకున్న నన్నయ కు దాన్ని ఎలా మొదలు పెట్టాలో తన సహాధ్యాయి నారాయణ భట్టు సహకారం తీసుకున్నాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు.

పురాణ యుగము/భాషాంతరీకరణ యుగము

సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ ,నారాయణులు యుగపురుషులు. రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంతవాతావరణం క్రీ.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.నన్నయ యుగముదీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు.
మొదటి శ్లోకం :

'నన్నయ ఆంధ్ర మహాభారతము శ్రీకారము త్రిమూర్తులను స్తుతించే ఈ సంస్కృత శ్లోకముతో జరిగినది.''
'''శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే'''
'''లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం'''
'''తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై'''
'''ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే'''
(లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుదు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!)

నన్నయగారి చివరిపద్యం:

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన -

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై

(శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు)
తాత్పర్యం: అవి శరత్కాలంలోని రాత్రులు; మిక్కిలి ప్రకాశమానాలైన నక్షత్రమాలికలతో కూడి ఉన్నవి, వికసించిన కొంగ్రొత్త తెల్ల కలువల దట్టమైనసుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి, అంతటావెదజల్లబడిన కప్పురపు పుప్పొడివలె ఆకసాన్నిఆవరించిన చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి మిక్కిలి సొగసుగా వున్నాయి.దీంట్లో నన్నయ తనమహాభినిష్క్రమణని సూచించాడా?
విశేషంలో వివరణ ఇలా వుంది: కొందరు పండితులు
ఈ పద్యంలోని చివరిపదగుంఫనం - పాండురుచిపూరములు + అంబరపూరితంబులై -
అని విరవటానికి బదులు - పాండురుచిపూరములన్ + పరపూరితంబులై- అని సంధి విశ్లేషిస్తే,నన్నయ చివరిమాట "పరపూరితంబులై" అని ఏర్పడుతుంది. అంటే భారతం పరులుపూర్తి చెయ్యాల్సిందేనని నన్నయ తన మరణాన్ని సూచించాడు!
=======================
======================================
బాదామి చాళు క్యులు : పశ్చిమ చాళు క్యులు

బాదామి చాళుక్య రాజైన రెండవ పుల కేశి (క్రీ.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని(ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినుని ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అన్న అనుమతితో వేంగిలో స్వతంత్ర రాజ్యం స్థాపించాడు. ఈ ప్రాంతం క్రమంగా వేంగి సామ్రాజ్యంగా పరిణితి చెందింది. కాని రాజరాజ నరేంద్రుని కాలానికి అంతఃకలహాల వలన, శత్రువుల దండయాత్రల వలన వేంగి గణనీయంగా బలహీనపడింది. అయితే తెలుగు సాహిత్యం మాత్రం వ్రేళ్ళూనుకొని అప్పటినుండి మహావృక్షంగా విస్తరించింది. తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రఖ్యాతి గాంచి, ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు 11వ శతాబ్దంలో కవిత్రయంలో మెదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించేవరకు జరగలేదు.
=====================================================================
ఆణిముత్యాలు

మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్ !


సభలో మనసుకు ప్రియంగా ఉండే మంచి వాక్యాలే చెప్పాలి. చాలా తక్కువగా మాత్రమే మాట్లాడాలి.
అదీ సరళంగా, ఎదుటివారు నొచ్చుకొనని రీతిగా మాట్లాడాలి. తెలుగు సాహిత్యంలో ప్రతి ఒక్కరు ఈ పద్యాన్ని నేర్చుకోవాలి .

సత్యవాక్య గొప్పదనం :
ఆణిముత్యాలు
నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు, మఱి బావులు నూఱిటికంటెనొక్క స
త్క్రతు వది మేలు, తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు, త
త్సుతు శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్

నూరు నూతులకంటె ఒక బావి (దిగుడు మెట్లున్నది) మంచిది. నూరు బావులకంటె ఒక యజ్ఞము మంచిది. అటువంటి నూరు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు. నూరుగురు కొడుకులకంటె ఒక సత్యవాక్యము మేలు.
========================================================================
నన్నయ - శ్రీమదాంధ్రమహాభారతము - అరణ్యపర్వము

అర్జునుడు పరమేశ్వరుని స్తోత్రము చేయుట

దండకము.

శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా
చంద్రధారీ మహేంద్రాదిబృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా
విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి
బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వ
క్రియాకారణం బంచు నానాప్రకారంబులన బుద్ధిమంతుల్ విచారించుచున
నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప
ప్రభావా భవానీపతీ నీవు లోకత్రయీవర్తనంబున మహీవాయుఖాత్మాగ్ని
సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్రక్రియాయంత్రవాహుండవై
తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన నిర్మలజ్ఞానదీప
ప్రభాజాలవిధ్వస్తనిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ
రాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపంకేరుహధ్యాన
పీయూషధారానుభూతిన సదాతృప్తులై నిత్యులై రవ్యయా భవ్యసేవ్యా
భవా భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాది
నానామునిస్తోత్రదత్తావధానా
లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ
ప్రసాదంబునన సర్వగీర్వాణగంధర్వులున
సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున
శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు
నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా
నమస్తే నమస్తే నమః.
========================================================================
మన మహాభారతం వ్యాసుని సంస్కృతమూలానికి అనువాదం కాదు....!!!!!

కవిత్రయం తెలుగువారికి ప్రసాదించిన ఆంధ్రమహాభారతం వ్యాసుని సంస్కృతమూలానికి అనువాదం కాదు. అనుసృజనం. పునసృష్టి .

1. మూలంలోని హరివంశాన్ని తెలుగు భారతంలో కలుపలేదు.ఇలా భారత గాధను తెలుగులో పాండవనాయకంగా మలచారు.
2. వ్యాసమహర్షి రచనలో శాస్త్రప్రతిపాదనా దృక్ధం, ప్రబోధ ప్రవృత్తీ ప్రముఖంగా ఉన్నాయి. కావ్యస్పృహ తక్కువ. అయితే తెలుగు భారతం ప్రధానంగా కావ్యేతిహాసం. "కావ్యరూప శాస్త్ర ఛాయాన్వయి".
3. వ్యాస భారతంలో శాంతరసం ప్రధానంగా ఉంది. తెలుగుభారతం ధర్మ వీర రస సమన్వితం. రస సమన్వయ రూపకం.
4. వేదం శబ్ద ప్రధానం. ఇతిహాస పురాణాలు అర్ధ ప్రధానాలు. వ్యాస భారతం అర్ధ ప్రధానమైన శాస్త్రేతిహాసం. కవిత్రయ భారతం ఉభయ ప్రధానమైన కావ్యేతిహాసం.
5. వ్యాసుని శ్లోక రచనా శైలికంటె నన్నయ పద్య రచనాశైలి విశిష్టమైనది, రస వ్యంజకమైనది. అనంతర కవులు నన్నయనే అనుసరించారు.
6. కవిత్రయం యధానువాదంచేయలేదు. స్వతంత్రానువాదంచేశారు. కధను మార్చలేదు. కాని కొన్ని వర్ణనలను తగ్గించారు.
కొన్నింటిని పెంచారు. కొన్ని భాగాలను సంక్షిప్తీకరించారు.
=========================================================
నన్నయ పై కన్నడ పంపన గారి ప్రభావం :
నన్నయ : చంపక మాలలు : 240 చంపకాలు [3 కృతులలో ] :
దేశి ఛందస్సులో కందాలు : 1219 కందాలు :
పంపన : 409చంపకాలు దేశి ఛందస్సులో 730 కందాలు

=====================================================================================
నన్నయ సామెతలు - పలుకుబళ్ళు :
* కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘన బుజుడు [ ఆదిపర్వం 6 -19]
*వెతుకుతున్న తీగ కాళ్ళకు తగిలిందనే -----సామెత
*గుండెలమీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్ర పోవడం -------నుడికారం
*వంటయిల్ కుందేలు సొచ్చె [ ఆదిపర్వం 6 వ అశ్వాసం ]
*అర్జుని వలని భయము సెడి రొమ్మును జేయిడి నిద్రవోయె [ ఆదిపర్వం 6 -63 ]

=========================================================================================
"సుప్రసిద్ధ వాఙ్మయమింకను గన్పడలేదు. చిక్కనిదానికై యంధకారములో తడవులాడుటకంటె, చెవులకింపుగా తెలుగు భారతమును "శ్రీవాణీ"యని మొదలు పెట్టి గోదావరీ తీర రాజమహేంద్రమున, రాజరాజు సన్నిధిని, పాడుచున్న ప్రసిద్ధాంధ్ర కావ్యకవి "నన్నియభట్టు"ను చూతముగాక రండు." -----కాళ్ళకూరు నారాయణరావు.
అని ' కాళ్ళకూరి ' గారు చెప్పిన మాటలు సదా చిరస్మరణీయాలు .
----------------------------------మీ తూర్పింటి .




ఈ వ్యాసం ఇంకా పూర్తి కాలేదు....మిగతాది త్వరలో....

తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాసిన నా ప్రత్యేక వ్యాసం

ప్రాభవం కోల్పోతున్న తెలుగు భాషకు జవసత్త్వాలు తిరిగి వచ్చేనా ?
                                               -----తూర్పింటి నరేశ్ కుమార్

"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా - గతమెంతో ఘనకీర్తి గలవాడా "
...అన్న వేములలపల్లి శ్రీకృష్ణ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. క్రీ.శ. 1 వశతాబ్దిలో ' నాగబు ' శబ్దంతో మొదలైన తెలుగు సాహితీ ప్రస్థానం నన్నయ, తిక్కన ల కాలంలో మొగ్గలు తొడిగి కృష్ణరాయల కాలంలో స్వర్ణయుగంగా పేరొందినది.
20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకుని 'సాహితీభారతి 'తనువు పులకరించిపోయింది.ఎంతో ఘన చరిత్ర కలిగినప్పటికినీ...ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే తెలుగు భాషా తేజం మసక బారుతున్నదా? అన్న సందేహం కలుగక మానదు. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం...మాతృభాషాపై తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల తెలుగు భాష క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోతున్నది.
మాతృభాషపై మమకారమేదీ....!!!!
"ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోనుండి
అమ్మ పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకు విందు
దేశభాషలందు తెలుగు లెస్స ".

అని మిరియాల రామకృష్ణ గారు పేర్కొన్నట్లుగా
: శిశువు తల్లి ఒడిలో పాలు తాగుతూ , తల్లి ముఖం నుండి నేర్చుకున్న భాషయే మాతృభాష. వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది మాతృభాషయే! భూమిపై జన్మించిన జీవరాసుల్లో బుద్ధి జీవియే మానవుడు .
భాషా సామర్ధ్యం మిగతా జీవులనుండి అతడిని వేరుచేస్తుంది.
భాష అంటే ఒక జాతి చరిత్ర .
భాష అంటే ఆ జాతి జీవనాడి .
శరీరం పనిచేయడానికి హృదయం ఎంత అవసరమో ఒక జాతికి భాష అటువంటిదే అని ఘంటాపథంగా చెప్పవచ్చును. భాషను వదులుకుంటే మన చేజేతులా మన చరిత్రను , సంస్కృతిని మనమే నాశనం చేసుకున్నట్లే. మనిషికి మనస్సు ,మేధ ముఖ్యమైనవి . విద్య మనోవికాసాన్ని , మేధో వికాసాన్ని కలిగిస్తుంది. మనోవికాసానికి సాహిత్య విద్య
మేధో వికాసానికి శాస్త్రీయ విద్య అవసరం.
ఈ రెండింటికీ భాష మూలం.
అన్నం పెట్టేది అవసరానికి ఆదుకునేది ఈ ప్రపంచంలో 'భాష అన్నది జగమెరిగిన సత్యం .
జాతిని , సంస్కృతిని , మానవ సంబంధాలను రూపొందించేది మాతృభాషనే అన్న భావాన్ని
మొక్కగా ఉన్నప్పుడే బాల బాలికల్లో మనం నిర్మించగలగాలి. ఆంగ్లేయుల నుండి స్వేచ్ఛ పొంది 60 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ , వారి మానస పుత్రిక అనబడే ' 'ఆంగ్లభాష ' బారినుండి మనం తప్పించుకోలేకపోతున్నాం.ఈ కాలంలో ఇంగ్లీషు పై వ్యామోహం తగ్గక అది క్రమేపి పెరుగుతూ వస్తుంది. మనది త్రిభాషా సూత్రం. మన విద్యార్థులకు ఏ భాషా సరిగా తలకెక్కదు. మన భాషపై మనకు పట్టు సరిగా ఉండదు. చివరకు నేటి విద్యార్థి జీవితం " రెంటికి చెడ్డ రేవడిలా " భవిష్యత్ అగమ్యగోచరమవుతుంది. మాతృభాష తెలుగు గల విద్యార్థి ఎల్.కె.జి స్థాయినుండి ఆంగ్లంలో విద్యనభ్యసించినపుడు సహజంగా అతను తన భాషా విలువలను , మూలాలను మరిచిపోవడం ఖాయం. 'పరభాషా మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌధం లాంటిదని' విశ్వకవి రవీంద్రుడు పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. ఉన్నత సామాజిక హోదాకలవారు , గొప్ప గొప్ప చదువులు చదివిన వారు తమకు తమకు తెలుగు బొత్తిగా రాదని చెప్పుకోవడం " స్టేటస్ సింబల్ "గా భావిస్తున్నారనే  విషయం మాత్రం అక్షరసత్యం .
పరభాషా వ్యామోహంలో తన స్వరూపాన్ని కోల్పోతున్న మాతృభాష!
సంస్కృతం లోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసి పోయె తేట తెలుగునందు " .

అని ఓకవి చెప్పినట్లుగా ...ఇతర భాషలలోని విశిష్ట లక్షణాలను తనలో ప్రోది చేసుకొని
వేల సంవత్సరాలనుండి తరతరాలుగా తన అస్థిత్వంను నిల్పుకుంటున్న తెలుగు భాష
21 వ శతాబ్దంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
అంటే తెలుగు రాష్ట్రమని , తెలుగు దేశమని , తీయనైన తెలుగు
తేట తేటల తెలుగు , దేశభాషలందు తెలుగు లెస్స ...వంటి వాక్యాలు ఒకప్పుడు వాడుకలో ఉండేవని భావితరాలవారు చెప్పుకోవాల్సిన దుస్థితి ఇంక ఎంతో దూరంలో లేదు.
ఒక సర్వే ప్రకారం ...
"300 సంవత్సరాల తర్వాత తెలుగు భాష అనేది అసలే ఉండదనీ ,
ఆ కాలంలో మళ్ళీ పరిశోధనలు చేసి తెలుగు భాష ,లిపి ఇలా
డాక్టరేట్ పట్టాలు పొందే సౌలభ్యం కలదు.
పాలక వర్గాల విధాన నిర్ణయాలు , అలసత్వం , సరళీకరణ , ప్రభుత్వ ధోరణులు
కాన్వెంట్ నాగరికతకు బీజాలు వేసింది.వీటిల్లో అ , ఆ లకు బదులు ఎ , బి ,సి , డి లు నేర్పిస్తారు. ఇక్కడి ఇంగ్లీష్ మీడియం చదువులు మమ్మీ , డాడీ ల సంస్కృతి , ఆంటీ - అంకుల్ ల శకానికి పునాది రాళ్ళు లేస్తున్నాయని చెప్పవచ్చును. ఉదయమనగా ఇంటినుండి బయలుదేరిన 7 ఏళ్ళచిన్నారి సాయంత్ర సమయానికి మోయలేనిపుస్తకాల భారంతో , అలసిపోయిన ముఖంతో ఇంటికి వచ్చి 'మమ్మీ ' అని పిలుస్తాడు. మమ్మీ అనగానే తల్లులు తమ చిన్నారి ఇంగ్లీష్ లో పిలుస్తున్నాడని మహానందపడి చంకలు గుద్దేసుకుంటారు.
కాని మమ్మీలు అనగా ఈజిప్ట్ భాషలో ' శవాలు ' అని ఎంత మంది తల్లిదండ్రులకు తెలుసు?
ఈ మమ్మీడాడీల కల్చర్ మధ్య తరగతి నుండి
దిగువ మధ్య తరగతికి శరవేగంగా వ్యాపిస్తోంది. .
కార్పోరేట్ కల్చర్ , పోష్ నడవడిక , ప్రతీ చిన్న విషయంలో పాశ్చాత్యీకరణకై అర్రులు చాచడం
పబ్ లో 'హగ్ ' లు ...డిస్కోథెక్ లలో 'బెల్లీ ' డ్యాన్స్ లు .... పార్టీలలో 'పార్టీ ' లకై సెర్చింగ్ లు... హైటెక్కులు డాలర్ కలలు ...వెరసి యువతకు తమ మాతృభాష అంటేనే అదో బ్రహ్మపదార్థంలా వింతగ చూసే పరిస్థితి నేడు నెలకొన్నది.
గరిమెళ్ళ సత్య నారాయణ గారు అన్నట్లుగా ...............................

"ఇం గ్లీ షు లేకుంటె ఇహ లోకములాలోన
ఎవ్వడైనా బ్రతుకగలడా
గువ్వలా బువ్వ తినగలడా
ఆంగ్ల జవ్వనులతో షేకుహాండులు పొందగలడా! అన్నది ఇక్కడ గమనార్హం ?!
నవతరం తల్లిదండ్రులు పిల్లలకు వారి యిష్టాయిష్టాలతో
ప్రమేయం లేకుండానే బలవంతగా పోటీ పరీక్షలు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు .
6వ తరగతి లోనే IIIT పౌండేషన్ చదువులు .... హావ్వ !ఇదేమి చోద్యం నక్కకు నాకలోకానికి
పొంతన కుదురుతుందా?
బలవంతమైన బరువు చదువులు విద్యా ర్థుల బాల్యాన్ని కుంగదీస్తున్నాయి .
పసి వయస్సులో ఫౌండేషన్ కోర్సులు కోర్సులు, పుస్తకాల మోతలు విద్యార్థికి
పెనుభారంగ పరిణమిస్తోంది.
చదువుల్లొ ఆటవిడుపులు లేక ,గమ్యాన్ని చేరు కోలేక ,మానసిక ఒత్తిడులు తట్టుకోలేని
కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నేడు నెలకొన్నది .